Real Estate

రిజిస్ట్రేషన్, దస్తావేజులు, అగ్రిమెంట్ పేపర్ల మీద రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపుల ప్రాముఖ్యత ఏంటి? అవి ఎందుకు ఉంటాయి?

కంప్యూటర్ స్టాంప్ డ్యూటీ లేని రోజుల్లో , ఫీజు స్టాంప్ పేపర్ విలువ బట్టి వసూలు చేసేవారు.

అంటే మీరు కట్టవలసిన రిజిస్ట్రేషన్ 516 రూపాయలు అనుకోండి. (ఈ రోజుల్లో ఇంత తక్కువ ఫీజు లేదనుకోండి) అప్పుడు 100 రూపాయల కాగితాలు ఐదు , 20 రూపాయల కాగితం 1 కొని అన్నిటి మీద కలిపి ఒప్పందం రాసుకునేవారు.

ఆ దరిద్రుడు అబ్దుల్ కరీం తెల్గీ స్కామ్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు 40 వేలు రుసుం ఉందనుకోండి. అంతా ఒక్కసారి కట్టి ఆ స్టాంపు ఒప్పందం మీద ముద్ర వేసుకుంటారు.

ఒక యాభై అరవై ఏళ్ల కిందట ఒప్పందాలు చూస్తే మీకు 75 నయా పైసలు స్టాంప్ లు కూడా కనపడతాయి.

ఒక్కోసారి రు 10,20,లేదా50 స్టాంపు పేపర్లు సరిపోతాయి. .ఒక్కోసారి 100 రూపాయల స్టాంప్ పేపర్ కావాలి.అప్పుడు దానిని ఉపయోగిస్తారు.ఇలా సమయాన్ని బట్టి ఉపయోగించు కొనుటకు వీలుగా వేర్వేరు పేపర్లు ముద్రిస్తారు.

రూ.10, 20, 50, 100 విలువ చేసే స్టా౦పుల అవసరం భూముల, ఆస్తుల క్రయవిక్రయాలకు మాత్రమే కాకుండా పలు ఇతర అవసరాలకు కూడా అవసరమే. వీటి వినియోగం ఇలా వుంది..

రూ. 10 స్టాపు

ప్రధానంగా నోటరీ పనులకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంటే పుట్టినతేదీ సరి చేసుకునేప్పుడు, చిరునామా నిర్ధారణకు, ఈ స్టాంపుపై రాసి, అర్జీదారు సంతకం చేసి, అర్హతపొందిన న్యాయవాది సంతకం ( కౌంటర్ సంతకం)తో సమర్పిస్తారు. ఇంకా అనేక అంశాలపై నోటరీకి దీన్ని వినియోగిస్తారు. సెల్ఫ్ అఫిడవిట్ కూ ఉపయోగిస్తారు. మిగిలిన స్తాంపుల కంటే, దీని వినియోగమే ఎక్కువ.

రూ. 20 స్టాపు

ఒక స్థలం, భూమి, భవనం కొనేప్పుడు అది ఎవరి పేరిట వుంది? దానిపై రుణాలు వున్నాయా, ఎంత విస్తీర్ణం వంటి విషయాలు అధికారికంగా తెలుసుకోవడానికి రిజిస్ట్రార్ కార్యాలయంలో నకలు తీసుకోవాలి. ఇందుకోసం రూ.20 స్టాంపు ను ఉపయోగిస్తారు. సరిఫైడ్ కాపీలు పొందాలన్నా ఇది అవసరమే. క్రయవిక్రయాల దస్తావేజులకు తగ్గినమేరకు కూడా వీటిని వినియోగించవచ్చు.

రూ.50–100

అన్ని రకాల క్రయవిక్రయాలకు వీటిని ఉపయోగిస్తారు. లావాదేవీల్లో పరస్పర ఒప్పందాలు, పార్తీకత్తులు, సెటిల్మెంటు దస్తావేజులు, కుటుంబ భాగ పరిష్కార పత్రాలు ( పార్టీషన్ ) కోసం ఇవి ఉపయోగపడతాయి.

భార్యాభర్తల మధ్య విడిపోయే పరిస్థితి వున్నపుడు, న్యాయ స్థానం వెలుపల పరిష్కారం కోసం పరస్పర అంగీకార పత్రాలు రూ.100 స్టాంపుపై రాసుకుంటారు.

లోక్ అదాలత్, సాల్వేన్సీ, ఎన్నికల నామినేషన్ పత్రాలకు అనుబంధంగా వినియోగిస్తారు.

ఇటీవల జరిగిన ఆంద్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలలో సర్పంచి అభ్యర్థి తాను గ్రామానికి చేయదలచిన పనులను రూ.10 స్టాంపుపై రాసి, సంతకాలు చేసి ఓటర్లకు పంపిణీ చేశారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published.