Mutual Funds

డెబిట్ ఫండ్ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము ఇది ఫిక్సిడ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్లైన కార్పొరేట్ మరియు ప్రభుత్వ బాండ్లలో, కార్పొరేట్ డెబిట్ సెక్యూరిటీలు మరియు మనీ మార్కెటింగ్ ఇన్స్ట్రుమెంట్లైన మొదలగు వాటిలో క్యాపిటల్ అప్రిసియేషన్ అందించే వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. డెబిట్ ఫండ్స్ని ఫిక్సిడ్ ఇన్కమ్ ఫండ్స్ లేదా బాండ్ ఫండ్స్ అని కూడా తెలుపుతారు.

డెబిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన పెద్ద లాభం, పోల్చినప్పుడు స్థిరమైన రిటర్నులు, అధిక లిక్విడిటీ మరియు సహైతుకమైన సురక్షత ఉన్నాయి.

రెగ్యులర్ ఆదాయం లక్ష్యంగా ఉండే ఇన్వెస్టర్ల కొరకు డెబిట్ ఫండ్స్ ఆదర్శమైనవి, కానీ రిస్క్ విముఖంగా ఉంటాయి. డెబిట్ ఫండ్స్ తక్కువ అస్థిరమైనవి, కావున ఈక్విటీ ఫండ్స్ కన్నా తక్కువ రిస్కుతో ఉంటాయి. మీరు సంప్రదాయ ఫిక్సిడ్ ఇన్కమ్ ఉత్పత్తులైనటువంటి బ్యాంకు డిపాజిట్లలో ఆదా చేస్తూ ఉండి మరియు తక్కువ అస్థిరమైన, క్రమం తప్పని రిటర్నుల కొరకు చూస్తూ ఉంటే, డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ చక్కని ఎంపిక ఎందుకంటే, అవి మీ ఆర్థిక లక్ష్యాలను మరింత పన్ను ప్రభావిత పద్ధతిలో మరియు మరింత చక్కని రిటర్నులు సంపాదించడానికి మీకు సహాయపడతాయి.

నిర్వహణ విషయంలో, డెబిట్ ఫండ్స్ పూర్తిగా ఇతర మ్యూచువల్ ఫండ్ స్కీములు కన్నా విభిన్నమైనవి కావు. అయితే, క్యాపిటల్ భద్రత విషయంలో, వాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ మార్కులు వస్తాయి.

Mutual Funds

డిన్నర్‌కు మీరు కూరగాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు వాటిని మీ పెరట్లో పెంచుతారా లేదా సమీపంలోని మండి/సూపర్‌మార్కెట్ నుండి మీకు అవసరమైన దానిని బట్టి కొనుగోలు చేస్తారా? మనం స్వంతంగా కూరగాయలను పండించడం గొప్ప దారి ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి, కానీ విత్తనాలు ఎన్నుకోవడం, ఎరువులు వేయడం, నారు పోయడం, కీటకాల నివారణ మొదలగు వాటి పైన శ్రమ చేయబడుతుంది. తరువాతి ఎంపిక కష్టమైన పని లేకుండా విస్తృత రకాల నుండి ఎంచుకునే ఎంపికను అందిస్తుంది.

అదేవిధంగా, మీరు సంపదను మంచి కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసి లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి తయారు చేయవచ్చు. మనం స్టాక్సుని కొనుగోలు చేసినప్పుడు మన డబ్బుని కంపెనీలు వాటి వ్యాపారాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు, అలా మన డబ్బుకి విలువను పెంచే సంపదను తయారు చేస్తుంది.

షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ రిస్క్ ఎలిమెంటుని కలిగి ఉంటుంది. మీరు కంపెనీ మరియు సెక్టారుని పరిశోధించడం ద్వారా స్టాక్సుని ఎన్నుకోవాలి. స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయబడిన వేల కంపెనీల నుండి కొన్ని కంపెనీల ఎన్నుకోవడం పెద్ద పని. మీరు ఒకసారి చేసిన తరువాత, ప్రతి స్టాకు పనితీరుని ట్రాక్ చేయాలి.

మ్యూచువల్ ఫండ్స్‌లో, స్టాక్ ఎన్నుకోవడం నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్ల ద్వారా చేయబడుతుంది. ఫండ్ లోపల ఉన్న ఒక్కో స్టాక్సుని కాకుండా మీరు ఫండ్ పనితీరుని ట్రాక్ చేస్తూ ఉండాలి. స్టాక్సు, గ్రోత్/డివిడెండ్, టాప్-అప్స్, సిస్టమాటిక్ విత్ డ్రాయల్స్/ట్రాన్స్ఫర్స్, మొదలగు వాటిలా పెట్టుబడి పెట్టే వెసులుబాటు కాకుండా, చిన్న మొత్తాలను ఎస్ఐపిల ద్వారా రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒడుదుడుకులను అధిగమించడానికి అవి వీలుకల్పిస్తాయి.

Mutual Funds

ఇక్కడ ముందుగా మీకో విషయం చెప్పాలి…ధనం ఉన్న వారిని మాత్రమే ధనవంతుడు అంటారు..అస్తి ఉన్న వారిని అస్తిపరులు అంటారు.చాలామంది అస్తి బాగా ఉన్నవారిని ధనవంతుల జాబితాలో చేరుస్తారు..అది పొరపాటు..

ఉదాహరణకు మీకు ఒక కొటి రూపాయలు అస్తి ఉందను కోండి. మీకు ప్రస్తుతం ఒక లక్ష రపాయల అవసరం వచ్చింది..ఈ లక్ష కోసం మీరు ఇల్లు అమ్ముకొలేరు కదా…అల అని తాకట్టు కూడా పెట్టలేరు….అందుకని..ఆస్తులు ఉండటం ఎంత అవసరమో,అవసరాలకి డబ్బు వుండటం కూడా అంతే అవసరం.ముఖ్యంగా పిల్లల చదువు, పెళ్లి ,retirement అవసరాలు..ఇలాంటి వాటి కోసం డబ్బు చాలా అవసరం.

మీకు ఇప్పటికే సొంత ఇల్లు ఉంటే.మీ దీర్ఘ కలిక అవసరాల కోసం ఈక్విటీ Mutual funds lo పెట్టుబడి పెట్టడం మంచిది.

ఒకవేళ మీకు సొంత ఇల్లు లేకపోతే housing loan తీసుకుని.ఇల్లు కోనుకొండి..మీ దగ్గర మొత్తం amount ఉన్నా కొంత మొత్తం loan తీసుకొంటే మంచిది..ఎందుకంటే housing loan EMI కూడ టాక్స్ benefits ఉన్నాయి (సెక్షన్80C, Principal amount),(section 24 loan interest amount).

చివరగా ఒక మాట;

ఇల్లు కొనటం అనేది అవసరం గా భావించాలి తప్ప పెట్టుబడి గా కాదు…పెట్టుబడి కోసం అయితే equity mutual funds better.. అయితే ఇది దీర్ఘకాలిక లక్ష్యాల కోసం.ఈక్విటీ పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గులు కు లోబడి ఉంటాయి .ఇది ఖచ్చితంగా గమనించాల్సన విషయం.

ఇల్లు లేదా మ్యూచువల్ ఫండ్స్?

రెండింటికీ దాని స్వంత ప్రయోజనాలు ఉన్నాయి,

ఇల్లు మీకు భద్రత మరియు మనశ్శాంతిని ఇస్తుంది. ఒకరు ఇల్లు కొంటే, అతడు ఇంట్లో ఎప్పటికీ ఉండగలడు, అదే ఇంటిని తరువాతి తరాలకు కూడా ఇవ్వవచ్చు. డబ్బు అవసరం సమయంలో, దానిని అమ్మవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్: ఇది ప్రమాదకర వెంచర్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టిన వాటాలను బట్టి, మ్యూచువల్ ఫండ్ల విలువ ప్రతి నిమిషం మారుతుంది. ఇది మీరు పెట్టుబడి పెట్టిన విలువ కంటే ఎక్కువ లేదా తక్కువ కావచ్చు. ప్రతి నిమిషం విలువ మారినప్పుడు, పెట్టుబడి గురించి మీకు మనశ్శాంతి ఉండకపోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా, రిస్క్‌ను బట్టి ఒకరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఈక్విటీ, రిస్క్, మార్కెట్, రుణ వైవిధ్యాలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాయి

నేను రిస్క్‌ని ఇష్టపడను, అందువల్ల మ్యూచువల్ ఫండ్స్‌కు వెళ్లేముందు కనీసం ఒక ఇంటిని కలిగి ఉండాలని సలహా ఇస్తున్నాను.

Mutual Funds Uncategorized

మ్యూచువల్ ఫండ్లలో (ఆ మాటకొస్తే స్టాక్ మార్కెట్లో) పెట్టుబడి అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడితో సమానం. ఊరికే డబ్బు పోగొట్టుకోవాలని అయితే ఎవరూ ఎందులోనూ పెట్టుబడి పెట్టరు (సాధారణంగా).

నాకు తెలిసిన ఒకాయన పాల వ్యాపారం గురించి బాగా వివరాలు సేకరించి అందులోకి దిగారు కానీ మూడేళ్ళలో నష్టాలకు మూసివేసారు. పాల వ్యాపారమే అప్పటికి మూడేళ్ళుగా నష్టాల్లో నడుపుతున్న ఇంకొకాయనపై నమ్మకంతో నా స్నేహితుడు 5 లక్షలు అందులో పెట్టుబడి పెట్టాడు. మరో మూడేళ్ళలకు లాభాలు మొదలై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం బాగా విస్తరించిన బ్రాండ్ అయిందది. ఆ 5 లక్షల వాటా ఇప్పుడు దాదాపు కోటి రుపాయలు విలువ చేస్తుంది. మరి పాలవ్యాపారం అది చేసేవారందర్నీ ధనవంతులను చేస్తుందా?

డ్యూ డిలిజెన్స్ (వ్యాపారం గురించి వివరాలు, విశేషాలు అన్నీ తెలుసుకుని, లాభం వచ్చే అవకాశం మెండుగా ఉందా అని తెలుసుకోవటం) – వ్యాపారం మొదలుపెట్టాలనుకునే ప్రతిఒక్కరు చేసేదే. అయినప్పటికీ అందరూ వ్యాపారంలో లాభాలార్జించలేరు. దీనికి కారణం అదృష్టం కాదు – నిరంతర శ్రమ, మార్పుకు సంకోచించని తత్వం. వ్యాపారం మొదలెట్టేశాం కదా అని గుఱ్ఱాల కళ్ళకు కట్టే బ్లింకర్స్ వంటివి పెట్టేసుకుని మూసధోరణిలో వెళ్తే కష్టం.

ఏ పెట్టుబడి అయినా అది అమలు చేసే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

మనం చేరాల్సిన గమ్యం ధనవంతులం అవడం అయితే మనల్ని అక్కడికి తీసుకువెళ్ళే వాహనాలలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. ఆ వాహనం నడిపే విధానాన్ని బట్టి మనం గమ్యం చేరుకుంటామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ మిమ్మల్ని ధనవంతులుగా చేయగలవా?

ఖచ్చితంగా చెయ్యగలవు. ఒక క్రమబద్ధమైన పద్ధతిలో పెట్టుబడి పెడితే మ్యూచువల్ ఫండ్ల ద్వారా ధనం సంపాదించడం సాధ్యమే.

అయితే పెట్టుబడి పెట్టేశాం, ఇక ధనవంతులైపోవటమే తరువాయి అని బిందాస్‌గా గుడ్లను చూసి కోడిపిల్లలను లెక్కపెట్టేసుకునే ధోరణి ఉంటే సత్ఫలితం దాదాపు అసంభవం.

  1. ఎంత కాలానికి, ఎందుకు పెట్టుబడి పెడుతున్నదీ స్పష్టంగా నిర్ణయించుకోవాలి.
  2. తదనుగుణంగా నాణ్యమైన మ్యూచువల్ ఫండ్లు ఎంచుకోవాలి.
  3. పెట్టుబడి దీర్ఘకాలానికైతే డైరెక్ట్ ఫండ్లనే ఎంచుకోవాలి.
  4. దీర్ఘకాలానికైతే (అంటే ఆరేళ్ళకు మించి) ఏడాదికోసారి, స్వల్పకాలానికైతే (అంటే రెండు-మూడేళ్ళకు) ఆరు నెలలకోసారి ఫండ్ పనితీరును సమీక్షించాలి.
  5. పనితీరు సంతృప్తికరంగా లేకపోతే నిర్మొహమాటంగా డబ్బును నాణ్యమైన ఫుండ్‌కు తరలించాలి.
  6. మార్కెట్లో వచ్చే కుదుపులకు (ఉదాహరణకు 2008, కోవిడ్) భయాందోళనలకు లోనవ్వకుండా, అటువంటి కుదుపులను అవకాశాలుగా ఉపయోగించుకోగల వెరవని ధైర్యముండాలి.

పైవన్నీ పాటించే ఎవరినైనా మ్యూచువల్ ఫండ్లు ధనవంతులను చేస్తాయి.

గమనిక: మ్యూచువల్ ఫండ్లు అంటే ఈక్విటీ ఫండ్లు అన్న అర్థంతోనే ఈ సమాధానం రాయటం జరిగింది. ఎందుకంటే నాణ్యమైన ఈక్విటీ ఫండ్లు మాత్రమే మదుపర్లను ధనవంతులను చెయ్యగలవు, వాటి ఉద్దేశ్యమూ అదే. డెట్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు ముఖ్యంగా ఎఫ్‌డీలను మించిన రాబడి పొందేందుకే.

Mutual Funds

ఒక పథకం యొక్క పనితీరు దాని నికర ఆస్తి విలువ (NAV) ను ప్రతిబింబిస్తూ తెలుస్తుంది. ఆ నికర ఆస్తి విలువ కాలపరిమితి లేని పథకాల్లో రోజువారీగాను, కాలపరిమితి గల పథకాల్లో వారం వారీగాను బహిరంగంగా ప్రకటింపబడుతాయి.మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఈ ఎన్ఎవిలు వార్తా పత్రికలలో ప్రచురించవలసిన అవసరం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ యొక్క వెబ్ సైట్లలో కూడా ఈ ఎన్ఎవిలు లభ్యమౌతాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క ఎన్ఎవిలను భారత మ్యూచువల్ ఫండ్స్ సంఘం (association of mutual funds in India) యొక్క వెబ్ సైట్ లో కూడా పొందుపరచాలి. ఎ ఎమ్ ఎఫ్ ఐ (AMFI) వెబ్ సైట్ ఏమిటంటే www.amfindia.com. ఆ విధంగా మదుపరులు అన్ని మ్యూచువల్ ఫండ్ల్ యొక్క ఎన్ఎవిలను ఒకే స్థలంలో పొందే వీలుంది.

అంతే గాకుండా, మ్యూచువల్ ఫండ్లు తమ యొక్క పనితీరును అర్ధసంవత్సరాల ఫలితాల రూపంలో ప్రచురించవలసిన అవసరముంది. గత ఆరునెలలు, ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, అయిదు సంవత్సరాలు కాలం ప్రకారం తమ పథకాలపై వచ్చే లాభాలు /ఆదాయాలతో కలిపి ప్రకటించవలసి ఉంది. ఈ ఫలితాలను పథకం ప్రారంభ సమయం నుంచి ప్రకటించాలి. మొత్తం ఆస్తులపై చేసిన ఖర్చుల శాతం వివరాలను మదుపరులు తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ఈ ఖర్చులు తమకొచ్చే ఆదాయంపై ప్రభావం చూపడమే కాక ఆ సంవత్సరం యొక్క అర్ధ సంవత్సరం సమాచారం వివరాల సమాచారానికి ఉపయోగపడ్తాయి.

సంవత్సరానికి వాటాదారులకు వార్శిక నివేదికను గాని సంక్షిప్త వార్షిక నివేదికను గాని మ్యూచువల్ ఫండ్లు పంపించవలసిన అవసరం కూడా ఉంది.

మ్యూచువల్ ఫండ్ల యొక్క పథకాల మీద, ఆ వివిధ పథకాలలో వచ్చే ఆదాయాల గురించి కూడా కలిపి చేసిన వివిధ రకాల అధ్యయనాలను ఆర్ధిక వార్తా పత్రికలలో వారం వారీగా ప్రచురించడం కూడా జరుగుతోంది. ఈ అధ్యయనాలే కాక అనేక పరిశోధనా సంస్థలు (many research agencies) కూడా మ్యూచువల్ ఫండ్ల యొక్క పనితీరుపై పరిశోధనా వ్యాసాలు ప్రచురిస్తున్నాయి. ఈ పరిశోధనా వ్యాసాలలో వివిధ రకాల పనితీరు స్థాయిని కూడా కలిపి తెలియ పరుస్తారు. మదుపరులు ఈ పరిశోధనా వ్యాసాలను అధ్యయనం చేసి వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల యొక్క వివిధ పథకాల పనితీరు గురించి ఇచ్చిన సమాచారం పై అవగాహన కలిగించుకోవాలి.

మదుపరులు తమ పథకాల పనితీరును అదే స్థాయిలోని ఇతర మ్యూచువల్ ఫండ్ల యొక్క పథకాల పనితీరుతో పోల్చుకోవచ్చు.వారు ఈక్విటీ ఆధారిత పథకాల యొక్క పనితీరుతో పాటు బిఎన్ఇ సెన్సి టివ్ ఇండెక్స్ (BSE Sensitive Index), ఎస్ &పిసిఎన్ ఎక్స్ నిఫ్టీ ( S&PCNX Nifty) మొదలైన పథకాల నిర్దేశిత ప్రమాణాల (benchmark)పనితీరుతో కూడా పోల్చుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ల యొక్క పనితీరు ఆధారంగా మదుపరులు మ్యూచువల్ ఫండ్ల పథకంలో ఎప్పుడు చేరాలో లేదా ఎప్పుడు విరమించుకోవాలో నిర్ణయించుకోగలరు .

మదుపరుల నుంచి పోగు చేసిన పెట్టుబడుల సొమ్మును మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎక్కడ మదుపు చేస్తారో తెలుసుకోవడం ఎలా?

అర్ధ సంవత్సరం వారీగా తమ మొత్తం పథకాలలోని పూర్తి వాటాల జాబితా(portfolios)లను మ్యూచువల్ ఫండ్స్ వార్తా పత్రికలలో ప్రచురించి ప్రకటించవలసిన (బహిరంగపరచవలసిన) అవసరముంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ తమ పూర్తి వాటాల జాబితాను యూనిట్ హోల్డర్లకు నేరుగా పంపుతాయి.

పథకం యొక్క వాటాల జాబితా ప్రతి సెక్యూరిటీలో మదుపు చేసిన మొత్తాన్ని తెలియజేస్తుంది. అంటే ఈక్విటీ , డిబెంచర్లు, మనీ మార్కెట్ పత్రాలు (instruments)ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైనవి. వాటియొక్క మొత్తం మార్కెట్ విలువ మరియు ఎన్ ఎ వి లో వాటి శాతం తెలియజేస్తాయి. ఈ వాటాల మొత్తం జాబితాలు నగదుగా మార్చుకునే సెక్యూరిటీల వాటాల జాబితాను ప్రకటించవలసిన అవసరముంది. అంతేగాక రేటెడ్ మరియు అన్ రేటెడ్ డెట్ సెక్యూరిటీలలో చేసిన మదుపు గురించి, నికర నిరర్ధక ఆస్తులు (NPAS- Non Performing Assets) గురించి కూడా ప్రకటించవలసి ఉంది.

కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వాటాదారులకు తమ పథకాలలో ఉన్న మొత్తం వాటాల జాబితాలతో కూడిన సమాచారాన్ని త్రైమాసిక వారీ లేఖల ద్వారా పంపుతాయి.

మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయడానికి మరియు ఒక కంపెనీ ప్రాథమికంగా ప్రజల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనల ద్వారా వాటిలో మదుపు చేయడానికి /ఏమైనా తేడా ఉందా?

ఉంది. తేడా ఉంది. మదుపరులకు మార్కెట్ పై గల భావన, అవగాహనల (Market sentiment and perception of Investors) ఆధారంగా కంపెనీల యొక్క ఐపిఒలు జారీ చేసే ధర కంటే ఎక్కువ లేదా తక్కువ ధరకు పెట్టుబడులను ఆహ్వానిస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్ల యొక్క ముఖ లేదా మూల విలువ (Par value) యూనిట్ల కేటాయింపు అయిన తర్వాత తక్షణం తగ్గడం కాని పెరగడం కాని జరగదు. మ్యూచువల్ పండ్ పథకాలు సెక్యూరిటీలలో మదుపు చేసేందుకు కొంత సమయం పడ్తుంది. పథకాల యొక్క(NAV- net asset value)ఎన్ఎవి – నికర ఆస్తి విలువ ఆ పథకాలు పెట్టుబడి పెట్టే సెక్యూరిటీ విలువ పై ఆధారపడి ఉంటాయి.

ఒకే స్థాయిలో వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు పథకాలను అందిస్తూ ఉంటే, ఎవరైనా తక్కువ ఎన్ఎవిగల పథకాలను ఎంపిక చేసుకోవచ్చా?

కొంతమంది మదుపరులు ఎక్కువ ఎన్ఎవిగల పథకాల కంటే తక్కువ ఎన్ఎవిగల పథకాలకు ప్రాముఖ్యత కల్పిస్తూ వాటిలో పెట్టుబడి పెట్టే ఉద్దేశం కల్గి ఉంటాయి. కొన్ని సమయాలలో వారు యూనిట్లు 10 రూపాయల చొప్పున జారీ చేసే కొత్త పథకాలకు ప్రాముఖ్యత ఇస్తారు. అప్పటికే అదే స్థాయిలో ఎక్కువ ఎన్ ఎ వి లకు అందించే పథకాలు అమలులో ఉన్నా మదుపరులు కొత్త వాటినే ఎంచుకుంటారు. మ్యూచువల్ ఫండ్ల పథకాల విషయంలో మదుపరులు ఈ విషయాన్ని గ్రహించాలి. అవేమిటంటే వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు తక్కువ లేదా ఎక్కువ ఎన్ఎవిలకు అందించే ఒకే రకమైన పథకాలకు ఒకదాని కంటే ఒకటి సంబంధం ఉండని విధంగా ఉంటాయి. పై విషయాలు పక్కన పెట్టి మదుపరులు తాము పెట్టుబడి పెట్టేందుకు ఎంపిక చేసుకున్న పథకం యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క పనితీరు రికార్డు, సేవల ప్రమాణం, వృత్తి నిర్వహణ మొదలైన వాటి ఆధారంగా ఆ పథకంలో మదుపు చేయాలి. ఈ కింద ఆ విషయాన్ని ఉదహరించడం జరిగింది.

ఉదాహరణకు పథకం ‘ఎ’ ఎన్ ఎ వి 15 రూపాయలకు అందుబాటులో ఉండగా పథకం ‘బి’ 90 రూపాయలకు అందుబాటులో ఉందనుకోండి. ఈ రెండు పథకాలు ఈక్విటీ ఆధారిత పథకాలయినప్పటికినీ వీటి పనితీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రెండు పథకాల్లో మదుపరి 9 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. పథకం ‘ఎ’లో అతడు 600 యూనిట్లను యూనిట్ 15 రూపాయల చొప్పున 9 వేల రూపాయలకు పొందగా పథకంలో ‘బి’లో అతడు 100 యూనిట్లను యూనిట్ కి 90 రూపాయల చొప్పున 9 వేల రూపాయలకు పొందుతాడు. మార్కెట్ లో వీటి ధర 10 శాతం పెరిగినట్లయితే , ఈ రెండు పథకాలు సమానమైన పనితీరుతో వాటి ఎన్ఎవిలను ప్రతిబింబిస్తాయి. అయితే పథకం ‘ఎ’లోయూనిట్ ఎన్ఎవి రూ11 16.50 లు కాగా పథకం’ బి’లో యూనిట్ ఎన్ ఎవి 99 రూపాయలు గా పెరుగుతుంది. ఈ ప్రకారం పెట్టుబడుల యొక్క మార్కెట్ విలువ రూ11 9900(600 యూనిట్లకి రూ11 16.50 చొప్పున ) పథకం ‘ఎ’లోనూ అదె 9900 రూపాయలకు 100 యూనిట్లకు రూ11 99 చొప్పున ఉంటాయి. అందువలన మదుపరి తాను పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క పథకం మీద 10 శాతం లాభం పొందుతాడు. ఈ కారణంగా పథకాల యొక్క ఎన్ఎవి తక్కువైనా లేదా ఎక్కువైనా మరియు తాను పెట్టుబడి పెట్టదలచిన సొమ్మును తక్కువ సంఖ్య్లో కేటాయింపబడిన లేదాఎక్కువ సంఖ్యలో కేటాయింపబడినాపెట్తుబడి పెట్టే నిర్ణయానికి ఈ అంశాలు పెద్దగా పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే కొత్త ఈక్విటీ ఆధారిత పథకం 10 రూపాయలకు ఇవ్వడానికి పెట్టుబడులు ఆహ్వానించినట్టయితే మరియు ప్రస్తుతం అమలులోఉన్న పథకం 90 రూ11లకు అందుబాటులో ఉన్నట్లయితే పథకంలో మదుపు చేసే నిర్ణయానికి ఈ అంశాలు పరిగణించనక్కరలేదు. ఇదే విధంగా ఆదాయం లేదా డెట్ ఆధారిత పథకాలకు కూడా ఈ అంశాలను పరిగణించనక్కరలేదు.

ఇది ఇలా ఉండగా, ఎక్కువ ఎన్ ఎ వి తో ఉత్తమ రీతిలో నిర్వహింపబడుతున్న పథకం ఎక్కువ లాభాలు గడించడంతో పోలిస్తే, అలాగే నైపుణ్యం కొరవదిన రీతిలో తక్కువ ఎన్ఎవితో నిర్వహింపబడుతున్న పథకం తక్కువ లాభాలు గడించడం సర్వసాధారణమే. అలాగే ఎన్ ఎ వి లు పడిపోయిన సందర్భాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ఎన్ ఎ వి లు కలిగి నైపుణ్యంతో కూడి నిర్వహింపబడుతున్న పథకం యొక్క ధర, తక్కువ ఎన్ ఎవి కల్గి నైపుణ్యం కొరవడి నిర్వహింపబడుతున్న పథకం యొక్క ధర పడిపోయినంతగా పడిపోదు. అందువలన మదుపరి వృత్తి నైపుణ్యంతో నిర్వహిస్తున్న పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అంతేగాని తక్కువ ఎన్ ఎ వి గల పథకానికి ఎక్కువ ప్రాధాన్యత రాదు. తక్కువ ఎన్ ఎ వి గల పథకంలో అతడు ఎక్కువ సంఖ్యలో యూనిట్లు పొందవచ్చు. కాని ఆ పథకం నైపుణ్యంతో నిర్వహింపబడకపోతే అతడు అధిక లాభాలు పొందలేడు.

ఎన్నో పథకాలు అందుబాటులో ఉండగా మదుపు చేయడం కోసం ఏ పథకం ఎంపిక చేసుకోవాలో ఎలాగ తెలుస్తుంది?

ఇంతకు ముందు చెప్పినట్టుగా, మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్లు జారీ చేసిన అమ్మకపు ఆహ్వాన పత్రంలోని పథకాన్ని క్షుణ్ణంగా చదవాలి. వారు ఆ పథకం యొక్క గత పనితీరు రికార్డును దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అలాగే అదే మ్యూచువల్ ఫండ్ యొక్క ఇతర పథకాలను గురించి కూడా తెలుసుకోవాలి. మదుపరులు తాము పెట్టుబడి పెట్టే పథకాల లక్ష్యాలతో సమానమైన లక్ష్యాలు గల ఇతర పథకాల పనితీరును సరిపోల్చు కోవలసి ఉంటుంది. ఒక పథకం యొక్క గత పనితీరు ఆ పథకం యొక్క భవిష్యత్ పనితీరుకు ఎటువంటి కొలబద్ద(indicator)కాదని మరియు గతంలో ఉత్తమ పనితీరు కనబరచినా, భవిష్యత్ లో అలాగే పనితీరు ఉంటుందో , ఉండకపోవడం జరగవచ్చని మదుపరి తాను పథకంలో పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకునే సమయంలో ముఖ్య అంశంగా ఆలోచించవలసి ఉంటుంది. డెట్ ఆధారిత పథకాల విషయంలో , గతంలో వచ్చిన లాభాల పై దృష్టి పెట్టడం కాకుండా మదుపరిడెట్ పత్రాల రేటింగ్ ను ప్రతిబింబించే వాటి నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలి. తక్కువ లాభాలనార్జించే ప్రమాణం గల పథకం ఉత్తమ ప్రమాణ పత్రాలుకలిగి ఉంటే అందులొ మదుపు చేయడం సురక్షితం . అలాగే, ఈక్విటీ పథకాలలో కూడా మదుపరులు నాణ్యత గల వాటాల జాబితాపై దృష్టి పెట్టాలి. మదుపరులు నిపుణుల సలహాలను తీసుకోవచ్చును. 

మ్యూచువల్ ఫండ్ల పథకాల మాదిరిగా కంపెనీలు మ్యూచువల్ బెనిఫిట్ అని పేర్లు కూడా పెట్టుకుని ఉండవచ్చా?

కొన్ని కంపెనీలు మ్యూచువల్ ఫండ్ల లాగే మ్యూచువల్ బెనిఫిట్ అని పేరు పెట్టుకొనవచ్చని మదుపరులు భావించవచ్చు. కాని అటువంటి కంపెనీలు సెబి పరిధి కిందకు రావు. సరిగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్లు సెబి మ్యూచువల్ ఫండ్లుగా తమ పేరు నమోదు చేసుకున్న తర్వాత తాము ప్రవేశ పెట్టబోయే పథకాలకు మదుపరులనుంచి పెట్టుబడులు ప్రోగు చేస్తాయి. 

స్పాన్సర్ హెచ్చు స్థాయి యోగ్యత కల్గి ఉంటే అతడు ఉత్తమ లాభాలు అందించగలడని హామీ ఇవ్వవచ్చా?

మ్యూచువల్ ఫండ్ పథకం జారీ చేసే అమ్మకపు ఆహ్వాన పత్రం లో స్పాన్సర్ గురించి మూడేళ్ళ సమయం యొక్క అతని యోగ్యత , అతని ఆర్ధిక నిర్వహణ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ను అందిస్తున్న కంపెనీ యొక్క పనితీరు రికార్డును మదుపరులు తెలుసుకోవడమే ఈ అంశం యొక్క ముఖ్యోద్దేశం. స్పాన్సర్ యొక్క యోగ్యత హెచ్చు స్థాయిలో ఉంటే పథకం అందించే లాభాలు అదికమౌతాయనుకోవడం సరియైనదికాదు. అలాగే ఎన్ ఎ వి విలువ పడిపోతే, స్పాన్సర్ ఆ విలువకు పరిహారం చెల్లిస్తాడనుకోవడం కూడా సమంజసం కాదు.

మ్యూచువల్ ఫండ పై సమాచారాన్ని మదుపరులు ఎక్కడనుంచి పొందవచ్చో ఎలాగ తెలుస్తుంది?

అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇంచుమించు తమ స్వంత వెబ్ సైట్లు (websites) కల్గి ఉన్నాయి. మదుపరులు అన్ని మ్యూచువల్ ఫండ్ల ఎన్ ఎ వి ల గురించి, అర్ధ సంవత్సరవారీ ఫలితాలు మరియు ఆ ఫండ్ల యొక్క వాటాల జాబితాలు భారత వెబ్ మ్యూచువల్ ఫండ్ల సంఘం (Association of web mutual funds in India) యొక్క వెబ్ సైట్ లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ (ఎఎమ్ఎఫ్ఐ- AMFI) www.amfiindia.com మదుపరులకుపయోగించే సమాచారాన్ని ఎఎమ్ఎఫ్ఐ కూడా ప్రచురిస్తుంది.

సెబి మార్గదర్శకాలు మరియు నియమ నిబంధనల గురించి సమాచారం పొందడానికి మదుపరులు సెబి యొక్క వెబ్ సైట్ www. sebi.gov.inకు log on చేసి మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ లోకి వెళ్ళవచ్చు. ఈ వెబ్ సైట్ లో మ్యూచువల్ ఫండ్స్ వివరాలు (డేటా), మ్యూచువల్ ఫండ్స్ పొందుపరచిన లిఖిత ఆఫర్ పత్రాలు , మ్యూచువల్ ఫండ్స్ యొక్క చిరునామాలు మొదలైనవి తెలుసుకొవచ్చును. అలాగే ఆ వెబ్ సైట్ లో సెబి యొక్క వార్షిక నివేదికలు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేగాక మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్ సైట్ లో ఇవ్వబడింది. అదే విధంగా ఎన్నో వెబ్ సైట్లలో వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోబాటు ఆ ఫండ్స్ ఏ కాలానికి ఎంత మొత్తంలో ఆదాయాలు ఇస్తాయో ఇవ్వబడ్డాయి. అలాగే ఎన్నో వార్తా పత్రికలు మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని రోజువారీ లేదా వారం రోజుల కొకసారి ప్రచురిస్తాయి. మ్యూచువల్ ఫండ్ల సమాచారాన్ని పొందడానికి మదుపరులు ఆ ఫండ్ల ప్రతినిధులను గాని పంపిణీ దారులను గాని సంప్రదించి వారి మార్గదర్శకత్వం పొందవచ్చు.

మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో మదుపు చేసే మదుపరి తన బదులు నామినీ ని నియమించుకోవచ్చా?

వ్యక్తులు వాటాలను పొందడానికి దరఖాస్తు చేసే సమయంలో నామినేషన్ ఇవ్వవచ్చు. అలాగే వ్యక్తులు వాటాలను తమ పేరిట కాని లేదా సంయుక్తంగా కాని కలిగి ఉన్నట్లయితే తమ తరఫున కూడా నామినేషన్ ఇవ్వవచ్చు. వ్యక్తులు కాకుండా ఉన్న సంస్థలు అనగా సంఘం, ట్రస్టు, బాడీ కార్పొరేట్ (body corporate), భాగ స్వామ్య సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబం (Hindu undivided family- HUF) యొక్క కర్త, పవర్ ఆఫ్ అటార్నిటి (holder of power of attorney) గల వారు నామినేషన్ ఇవ్వరాదు. 

మదుపరులు తమ సమస్యలను (పిర్యాదులను) ఏ విధంగా పరిష్కరించుకోగలరు?

మ్యూచువల్ ఫండ్ పథకాల యొక్క పెట్టుబడి ఆహ్వాన పత్రంలో మదుపరులు తమ యొక్క ప్రశ్నలు, పిర్యాదులు లేదా సాధక బాధకాల గురించి ఏ పేరుగల వ్యక్తితో సంప్రదించాలన్న విషయం ఆధారంగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలను ఆ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు పర్యవేక్షిస్తారు . పెట్టుబడి ఆహ్వాన పత్రంలో అస్సెట్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ల పేర్లు మరియు ట్రస్టీల పేర్లు కూడా ఇవ్వబడతాయి. మదుపరులు తమ యొక్క మ్యూచువల్ ఫండ్ లేదా తమ యొఅక్క మ్యూచువల్ ఫండ్ యొక్క మదుపరుల సేవా కేంద్రానికి వెళ్లి తమ పిర్యాదులు చేయవచ్చు. తమ పిర్యాదులు ఇంకా పరిష్కారం కాకపోతే, ఆ మదుపరులు సెబిని సందర్శించి తమ పిర్యాదులకు మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించమని కోరవచ్చు. పిర్యాదులను స్వీకరించిన తర్వాత సెబి (SEBI) ఆ పిర్యాదులకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లతో సంప్రదించి క్రమంగా వాటి పరిష్కారం కొసం చర్యలు చేపట్టవచ్చు. మదుపరులు తమ పిర్యాదులను ఈ కింది మూలం/ ఆధారం( సోర్స్) కు కూడా పంపవచ్చు.

ఆధారము: SEBI-FAQ’S

Mutual Funds

మ్యూచువల్ ఫండ్స్ అంటే మార్కెట్ విషయంలో వృత్తిపరంగా నైపుణ్యం సాధించిన మదుపరులతో కూడిన సం స్థ నిర్వహించే పెట్టుబడుల శాఖ. మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ ,బాండ్లు, సంస్థ స్వంతంగా నిర్వహించే సంయుక్త పెట్టుబడులు (అనేకమదుపరులతో కూడినవి). ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు షేర్స్ కొనుగోలు చేస్తే మీరు పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని వారు మరే ఇతర సంస్థల్లోనై నా అధిక లాభాలు వచ్చే విధంగా స్టాక్స్ లో బాండ్ల లో మరేదైనా విధంగా కొనుగోలు రూపంలో పెట్టుబడి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడికి వారు తమ షేర్ హోల్డర్ లకు నెలవారీ, త్రైమాసికంగా, ఆరు మాసాలకోమారు ప్రకారం డివిడెండ్ల రూపంలో లాభాలను పంపిణీ చేస్తారు
ఒక పరిశ్రమ గాని మార్కెట్ గాని మీరు ఊహించి న విధంగా లాభాలను ఆర్జించలేకపోవచ్చు. నష్టాల్లో కూరుకు పోవచ్చు. కాని చిన్నచిన్న మొత్తాలలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టే చిన్న మదుపరులు తాము తమ నష్టాలను సాధ్యమైన రీతిలో తగ్గించుకునేందుకు మార్కెట్ లో అనుభవం గడించిన విశ్లేషకులు, వృత్తి నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విశ్లేషకులు తమ మదుపరులు పెట్టే పెట్టుబడిని ఒక పరిశ్రమ, ఒక మార్కెట్ లో కాక వివిధ రకాల కంపెనీలు, సెక్యూరిటీలలో చిన్న చిన్నమొత్తాల్లో పెట్టు బడి పెట్టే సలహాలిచ్చి మదుపరుల నష్టాలను తగ్గిస్తారు. అదే ఈ మ్యూచువల్ ఫండ్స్ వల్ల జరిగే వెసులుబాటుగా గుర్తించాలి. అయితే ఈవిధానంలో కూడ ప్రమాదముందని మదుపరులు గుర్తించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిపుణుల సలహాలు ఆచరించినా, స్టాక్సు ధరతగ్గే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ప్రమాదమున్నప్పటికినీ భవిష్యత్ అవసరాలకు డబ్బును స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం శ్రేయోదాయకం. మీరు స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్ లో డబ్బును పెట్టుబడి పెట్టడంలో ఉన్న ప్రాధాన్యతను ముందే గమనించండి.

సంయుక్త పెట్టుబడులు ( మూలధనం లేదా నిధులు)

పరిచయం

మదుపరులకు (investors) వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనువైన పద్ధతులు లేదా మార్గాలు (avenues) అందుబాటులోకి వచ్చాయి లేదా ఉన్నాయి. మదుపరులకు సంయుక్త పెట్టుబడులు ( Mutual Funds) పద్ధతిలో తమ యొక్క పెట్టుబడులు పెట్టుకునేందుకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. మదుపరులు తాము పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకొనే సమయంలో వివిధ రకాల పత్రాలలో (instruments)తాము చెల్లించవలసిన పన్నులను సర్దుబాటు చేసేందుకు ఆ పెట్టుబడులలో ఉన్న నష్టాలు( risks) మరియు వాటిలో వచ్చే లాభాలను బేరీజు వేసుకోవాలి. పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకునే సమయంలో మదుపరులు, నిపుణులు మరియు సలహాదారుల సలహాలను తీసుకోవాలి. వీటితో బాటు మ్యూచువల్ ఫండ్స్ పథకాల యొక్క ఏజెంట్లు మరియు పంపిణీదారుల సలహాలు కూడ తీసుకోవాలి.

సంయుక్త పెట్టుబడులు ఏ విధంగా పనిచేస్తాయో మదుపరులకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ పత్రంలో ప్రశ్నలు – సమాధానాల రూపంలో సమాచారాన్ని అందించే ప్రయత్నం జరిగింది. మదుపరులు తమ పెట్టుబడులు లేదా మదుపు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుంది.

సంయుక్త పెట్టుబడులు (మ్యూచువల్ ఫండ్స్) అంటే ఏమిటి ?

మదుపరులకు వాటాలు (యూనిట్లు) జారీ చేసి తద్వారా ఆర్ధిక వనరులను (resources) సమీకరించుకునే ప్రక్రియనే మ్యూచువల్ ఫండ్ అని అంటారు. అలా సమీకరించిన ఫండ్స్ ను తాము ప్రకటించిన పత్రంలో చెప్పిన విధంగా తమ లక్ష్యసాధనగా సెక్యూరిటీస్ లో మదుపు చేస్తారు.

సెక్యూరిటీస్ లో మదుపు చేయడం అనగా ఈ పెట్టుబడులను వివిధ రంగాలలోని విస్తరించిన పరిశ్రమల్లో వేరువేరుగా పెట్టుబడి పెట్టి నష్టాల స్థాయిని తగ్గించడమే అని పేర్కొనాలి. ఒకే సమయంలో, ఒకే విధంగా (నిష్పత్తిలో) ఒకే దిశలో అన్ని స్టాకుల పనితీరు ఉండదు, కనుక నష్టాల తగ్గుదలలో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లోని అన్ని పరిశ్రమలు ఒకే విధంగా ఉండవు కాబట్టి (Diversification) మ్యూచువల్ ఫండ్స్ తమయొక్క మదుపు చేసిన సొమ్ము విలువకు తగిన వాటాలు (యూనిట్లను) జారీ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లోని మదుపరులను యూనిట్ హోల్డర్స్(వాటా దారులు) అంటారు.

మదుపరులు తాము మదుపు చేసిన సొమ్ముకు దామాషా (proportion) పద్ధతిలో లాభాలు లేదా నష్టాలు పొందుతారు. కాలానుగుణంగా (time to time) మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాల లక్ష్యాలతో వివిధ పరిధుల్లో తమ పెట్టుబడులు పెడుతున్నట్టు సాధారణంగా ప్రకటిస్తూ ప్రారంభిస్తాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్ భారత సెక్యూరిటీస్ మరియు మారక సంస్థ (securities and exchange board of India)లో తప్పక నమోదు చేసుకుని ఉండాలి. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు ఆ సెక్యూరిటీస్ మార్కెట్ ను నియంత్రించే ఈ సంస్థ తన పేరు నమోదుచేసుకోవడానికి కారణం అదే.

భారత దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ చరిత్ర ఏమిటి ? మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో సెబి(SEBI) పాత్ర ఏమిటి ?

1963 వ సంవత్సరంలో భారత దేశంలో మొట్టమొదటగా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ మ్యూచువల్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. 1990వ సంవత్సర ప్రారంభంలో, భారత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలయిన బ్యాంకులు, తదితర సంస్థలు (LIC) వంటివి మ్యూచువల్ ఫండ్స్ ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.

1992 వ సంవత్సరంలో భారత సెక్యూరిటీస్ మరియు మారక సంస్థ (securities and exchange board of India) చట్టం అమలులోకి వచ్చింది. సెబి(SEBI- securities and exchange board of India) ఉద్దేశం యేమిటంటే – సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెట్టే మదుపరుల ఆర్ధిక శ్రేయస్సు అలాగే సెక్యూరిటీస్ మార్కెట్ ను అభివృద్ధి పరచడం మరియు నియంత్రించడమూ, మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించినంతవరకు – మదుపరుల డబ్బుకు భద్రత కల్పిస్తూ వారి శ్రేయస్సుకు పాటుపడడం, మ్యూచువల్ ఫండ్స్ ను నియంత్రించే విధివిధానాలను రూపొందించడం సెబి (SEBI) కర్తవ్యం లేదా విధి. 1993 వ సంవత్సరములో సెబి (SEBI) నియమ నిబంధనలను ప్రకటించింది. ఆ తర్వాత ప్రైవేటు రంగ సంస్ధలు కూడా మ్యూచువల్ ఫండ్స్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆ విధంగా క్యేపిటల్ మార్కెట్ లో ప్రైవేటు భాగస్వామ్యము కూడా ప్రారంభమైంది. 1996 వ సంవత్సరములో నియమ నిబంధనలన్నీ పూర్తిగా సవరించబడ్డాయి. క్రమేపీ (Time to time) ఆ నియమ నిబంధనలు సవరింపబడుతూ ఉన్నాయి. మదుపరుల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని సెబి క్రమేపీ మ్యూచువల్ ఫండ్స్ కు మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేస్తోంది.

ప్రభుత్వ రంగ లేదా ప్రైవేటు రంగ సంస్ధలు ప్రారంభించిన మ్యూచువల్ ఫండ్స్ గాని లేదా విదేశీ సంస్ధలచే అభివృద్ది చేయబడుతున్న మ్యూచువల్ ఫండ్స్ గాని అవే నియమ నిబంధనలకు లోబడి నియంత్రించబడతాయి. వీటిలో వేటికీ భేదభావం చూపకుండా సెబి ఈ నియమ నిబంధనలను మ్యూచువల్ ఫండ్స్ కు వర్తింపచేస్తూ, పర్యవేక్షిస్తుంది. ఈ సంస్ధలు అందిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పధకాలన్నింటికి సంబంధిం చిన నష్టాలు ఒకే రీతిలో వుంటాయి.

మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు?

మ్యూచువల్ ఫండ్స్ ను ఒక ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేస్తారు. ఈ ట్రస్ట్ లో హామీదారు లేదా పూచీపడువారు లేదా ఏర్పరచువారు (sponsor), ట్రస్టీలు, ఆస్తులు నిర్వహించే కంపెనీ (Asset Management Company –AMC) మరియు సంరక్షకుడు (Custodian) వుంటారు. ఈ ట్రస్ట్ ను ఒక పూచీదారు కాని అంతకంటే ఎక్కువ పూచీదారులు కాని ఏర్పాటు చేస్తారు. వారినే సంస్థ ప్రవర్ధకులు (promoter)అని అంటారు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఆస్తులకు జవాబుదారులుగా ధర్మకర్త (ట్రస్టీ)లు ఉంటారు. వీరు యూనిట్ హోల్డర్ల యొక్క శ్రేయస్సు కోసం నియమింపబడతారు. సెబి చే అనుమతి పొందిన ఆస్తులు నిర్వహించే కంపెనీ (Asset Management Company –AMC) మ్యూచువల్ ఫండ్స్ ను ఏ ఏ రకాల సెక్యూరిటీస్ లో మదుపు చేయాలో నిర్ణయించి అమలు చేస్తుంది. సెబితో నమోదు చేసుకున్న సంరక్షకుడు (custodian) , వివిధ రకాల పథకాలలో వున్న ఫండ్ సెక్యూరిటీలను తన అధీనంలో ఉంచి కాపాడుతుంటాడు. ఎఎమ్ సి పై ధర్మకర్త (ట్రస్టీ)లకు పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది. ఆదేశాలిచ్చే అధికారం కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ సెబి యొక్క నియమనిబంధనలను పాటిస్తున్నదీ లేనిదీ అలాగే ఆ ఫండ్ పనితీరునూ పర్యవేక్షిస్తుంది.

ట్రస్ట్ యొక్క డైరెక్టర్ లలో మూడవ వంతు లేదా ట్రస్ట్ బోర్డ్ లో మూడవ వంతు ధర్మకర్త లు (ట్రస్టీలు) స్వతంత్రులై ఉండాలనే నియమనిబంధన ఉంది. ఆ నియమ నిబంధనలకనుగుణంగా ఈ మూడవ వంతు ట్రస్టీలు పూచీదారులతో (స్పాన్సర్స్) ఎటువంటి సంబంధము లేనివారై ఉండాలి. అలాగే ఎ ఎమ్ సి లోని సగం మంది డైరెక్టర్ లు కూడ స్వతంత్రులై ఉండాలి. ఏ పథకమైనను ప్రారంభించేముందు (అమలులోకి తెచ్చే ముందు) అన్ని మ్యూచువల్ ఫండ్స్ సెబితో నమోదు చేసుకుని ఉండాలి.

ఒక పథకం యొక్క నికర ఆస్తుల విలువ అంటే అర్ధం ఏమిటి?

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రత్యేక లేదా నిర్ధిష్ట పథకం పనితీరు ఆ నికర ఆస్తుల విలువ (NAV) ద్వారా కనుగొంటారు.

మదుపరుల నుండి సేకరించిన సొమ్మును సెక్యూరిటీస్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ మదుపు చేస్తాయి. అర్ధమయ్యేరీతిలో చెప్పాలంటే, ఒక పథకం యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ విలువే ఆ పథకం యొక్క నికర ఆస్తి విలువ(NAV). సెక్యూరిటీస్ మార్కెట్ విలువ ప్రతీరోజు మార్పు చెందడం వల్ల పథకం యొక్క NAVకూడా రోజువారీగా మారుతుంటుంది. పేర్కొన్న రోజుకు ఒక యూనిట్ యొక్క ఎన్ఎవి ఎంత అంటే ఆ యూనిట్ కలిగిన పథకం యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ విలువను ఆ పథకంలో గల మొత్తం యూనిట్ల సంఖ్యలో భాగించగా వచ్చిన ఫలితమేనని చెప్పాలి. ఉదాహరణకు ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలోగల సెక్యూరిటీస్ మార్కెట్ విలువ 200 లక్షల రూపాయలు అనుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ 10 లక్షల యూనిట్లను మదుపరులకు యూనిట్ 10 రూపాయల చొప్పున జారీ చేసి ఉంటే ఆ ఫండ్ యొక్క ఒక యూనిట్ ఎన్ఎవి 20 రూపాయలుఅని చెప్పాలి. మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క పథకం ఎన్ఎవిని రోజువారీగాగాని, వారానికొకసారి గాని పథకం యొక్క లక్షణాన్ని బట్టి ప్రకటించవలసి ఉంటుంది.

వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ పథకాలేమిటి?

పరిపక్వత సమయాన్ని అనుసరించి పధకాలు

ఒక మ్యూచువల్ ఫండ్ పధకం కాల పరిమితి లేనిది లేక కాల పరిమితికి లోబడినది అని విభజించాలంటే దాని పరిణితి ద్వారా నిర్ధారించాలి.

కాల పరిమితి లేని ఫండ్ / పధకం

ఒక కాల పరిమితి లేని ఫండ్ / పధకం అని చెప్పాలంటే ఆ పధకం ఎల్లప్పుడూ సొమ్ము సేకరిస్తూ, చెల్లిస్తూ తిరిగి చెల్లించిన వాటాలను కొనుగోలు చేస్తూ నిరంతర ప్రక్రియగా సాగిస్తూ ఉంటే దానిని కాల పరిమితి లేని ఫండ్ / పధకం అంటారు. ఈ పధకాలకు స్ధిరమైన పరిపక్వత సమయం అంటూ ఏమీ వుండదు. మదుపరులు తమ అనుకూలత ప్రకారం వాటాల కొనుగోలు మరియు అమ్మకాలు రోజువారీ ఎన్ఎవి (N A V) ఆధారంగా చేసుకోవచ్చు. ఈ పధకం ముఖ్యలక్షణం మదుపరుల వాటాలకు ద్రవ్యత్వం (liquidity) అనగా నగదు పొందడం లేదా ఇవ్వడం సులభం.

కాల పరిమితి గల ఫండ్ / పధకం

ఒక కాల పరిమితి గల ఫండ్/ పధకానికి పరిపక్వత సమయం నిర్ణయించబడి వుంటుంది. ఉదా:5– 7 సంవత్సరములు. ఈ పధకం ప్రారంభంలో కొంత కాలం గడువు ఇస్తారు. ఈ సమయంలో దీనిలో మదుపరులు పెట్టుబడులు పెట్టడానికి / వాటాలు కొనుగోలు చేయడానికి తెరిచి వుంటుంది. మదుపుదారులు ఈ పధకం తెరిచి వుంచిన కాలంలో కాని లేదా పట్టావినిమయం (Stock Exchange) లో పొందుపరచిన పట్టిక నుండి కాని వాటాలను కొనుగోలు చేయవచ్చు. మదుపరులు ఈ పధకం నుండి తప్పుకొనుటకు వీలుగా కొన్ని కాల పరిమితి గల ఫండ్ / పధకంలో వాటాలను ఎన్ ఎ వి (N A V) ధరల ఆధారంగా తిరిగి అమ్ముకునే వీలుకల్పిస్తూ మ్యూచువల్ ఫండ్ లు తిరిగి కొనుగోలు చేస్తాయి. సాధారణంగా ఈ మ్యూచువల్ ఫండ్ లు ఎన్ ఎ వి (N A V) ధరలను వారం వారం ప్రకటిస్తారు.

పెట్టుబడి ఉద్దేశంతో ఏర్పాటు చేసే పధకాలు

ఒక పథకం అభివృద్ధి పథకంగా కూడా విభజించవచ్చు. ఆదాయ పథకం లేదా మదుపు చేసే ఉద్దేశం కల్గిన సమతౌల్య పథకంగా కూడా విభజించవచ్చు. ఈ పథకం కాల పరిమితి లేని ఫండ్ / పథకం లేదా కాల పరిమితి గల ఫండ్ పథకాలుగా ఇదివరకే వివరించడం జరిగింది. ఈ పథకాలన్నింటిని ఈ కింద పేర్కొన్న విధంగా విభజించవచ్చు.

అభివృద్ధి / ఈక్విటీ ఆధారిత పథకం

అభివృద్ధి పథకం ముఖ్య లక్షణం యేమిటంటే పెట్టిన మూలధనం విలువ పెరగడం. మధ్య తరహా నుంచి దీర్ఘకాలం సమయంలో దీని విలువ పెరుగుతుంది. ఈ పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా తమ మూలనిధిలోని ఎక్కువ భాగం ఈక్విటీలుగా మదుపు(పెట్టుబడిగా పెడతారు) చేస్తారు. ఈ ఫండ్స్ లో నష్టాలను పోల్చి చూస్తే అధికంగా ఉంటాయి. ఈ పథకాలు మదుపరులకు వివిధ రకాల ఐచ్చికాలను కల్పిస్తాయి. డివిడెండ్ ఆప్షన్ , మూలధనం పెరగడం వంటి ఐచ్చికాల వంటివి కల్పిస్తాయి. మదుపరుల ప్రాముఖ్యతను బట్టి తమకనువైన ఐచ్చికాలను పేర్కొనవలసి ఉంటుంరది. తర్వాత కాలంలో మదుపరులు తమ ఐచ్చికాలను మార్చుకునే వీలును మ్యూచువల్ ఫండ్స్ కల్పిస్తాయి లేదా అనుమతినిస్తాయి. అభివృద్ధి పథకాలు మదుపరులకు దీర్ఘకాలిక ప్రయోజనం కల్పిస్తాయి. దీర్ఘకాలంలో మదుపరులకు తాము పెట్టిన పెట్టుబడుల మూలధనం విలువ పెరిగే రీతిలో ఉంటాయి.

ఆదాయం / డెబ్ట్ ఆధారిత పథకం

మదుపరులకు క్రమబద్ధమైన రీతిలో నిర్దిష్టమైన ఆదాయం కల్పించడం ఆదాయం ఫండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో చేసే మదుపును స్థిరమైన ఆదాయం ఇచ్చే సెక్యూరిటీలు అనగా బాండ్లు, కంపెనీల డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు మనీ మార్కెట్ పత్రాలలో మదుపుగా చేస్తారు. ఈ ఫండ్స్ లో చేసే మదుపు ఈక్విటీ పథకాల్లో చేసే మదుపుతో వచ్చే నష్టాలలో పోల్చి చూస్తే కొంత తక్కువనే చెప్పాలి. ఈక్విటీ మార్కెట్లలో వచ్చే (హెచ్చుతగ్గుల ) మార్పుల ప్రభావం ఈ ఫండ్స్ పై ఉండదు. ఈ పథకాలలో మూలధనం విలువ పెరుగుదల కూడా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫండ్స్ లోని ఎన్ఎవిలు దేశంలోని వడ్డీరేట్లలొ వచ్చే మార్పులకనుగుణంగా వుంటాయి. వడ్డీరేట్లు తగ్గిపోయినచో ఈ ఫండ్స్ యొక్క ఎన్ఎవిలు తక్కువ వ్యవధికి పెరగవచ్చు. అలాగే పెరిగినచో ఎన్ఎవిలు తగ్గిపోవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే మదుపరులు ఈ హెచ్చుతగ్గుల మార్పుల గురించి ఆందోళన చెందకపోవచ్చు

బ్యాలెన్స్ డ్ ఫండ్

అభివృద్ధి మరియు క్రమబద్ధమైన ఆదాయం మదుపరులకు కల్పించడం బ్యాలెన్స్ డ్ ఫండ్ ల యొక్క ముఖ్యోద్దేశం. ఈ ఫండ్స్ లోని పథకాలలోను ఈక్విటీలలోను మరియు స్థిరమైన ఆదాయం కల్పించే సెక్యూరిటీలలోను తమ ప్రకటన పత్రాలలో పేర్కొన్న రీతిలో దామాషా పద్ధతిలో మదుపును చేస్తారు. తగినంత అభివృద్ది ఉంటే చాలన్న మదుపరులకు ఈ ఫండ్స్ లోని పథకాలు అనువైనవిగా ఉంటాయి. వీరు సాధారణంగా ఈక్విటీ మరియు డెబ్ట్ సాధనాలలో 40-60% వరకు మదుపు చేస్తారు. స్టాకు మార్కెట్లలోని షేర్ల ధరలలో వచ్చే హెచ్చు తగ్గు మార్పులు ఈ ఫండ్స్ పై ప్రభావం కల్గిస్తాయి. పూర్తి ఈక్విటీ ఫండ్స్ తో పోలిస్తే ఈ ఫండ్స్ లో ఎన్ఎవిల తీవ్రత కొంత మేరకు తక్కువ స్థాయిలోనే ఉంటుంది

మనీ మార్కెట్ లేదా ద్రవ్యశీలత ఫండ్స (అతి త్వరగా నగదు రూపంలో మార్చుకునే ఫండ్)

ఈ ఫండ్స్ కూడా ఆదాయం ఇచ్చేవి. వీటి ముఖ్యోద్దేశం ఏమిటంటే మూలధనాన్నిభద్రపరచడం, త్వరగా నగదుగా మార్చుకునే సౌకర్యం మరియు తగినంత (మిత) ఆదాయం కల్పించడం. ఈ పథకాలన్నీ సురక్షితమైన స్వల్ప కాల వ్యవధితో కూడిన ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ల సర్టిఫికెట్లు, వ్యాపార లావాదేవీల పత్రాలు (commercial papers), అంతర బ్యాంకుల కాల్ మనీ (inter- bank call money), ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైన వాటిల్లో మాత్రమే మదుపు చేస్తాయి.

గిల్ట్ ఫండ్

ఈ ఫండ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో మాత్రమే మదుపు చేస్తాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు తిరిగి చెల్లించవన్న అపనమ్మకం ఉండదు. అయితే ఈ పథకాల ఎన్ఎవిలు వడ్డీ రేట్లు మారుతున్నప్పుడల్లా హెచ్చుతగ్గులతో మార్పు చెందుతాయి. అలాగే ఆర్ధిక కారణాల వలన కూడా మారుతాయి. ఎలాగంటే ఆదాయ లేదా డెట్ ఆధారిత పథకాలు ఎలా మారుతాయో ఆ విధంగానే మారుతాయి.

ఇండెక్స్ ఫండ్

ఇండెక్స్ ఫండ్ ఒక ప్రత్యేక సూచిక (పట్టిక) లో పేర్కొన్న రీతిని ప్రతిబింబిస్తాయి. అంటే బిఎస్ ఇ సెన్సిటివ్ ఇండెక్స్ (BSE sensitive index), ఎస్ &పిఎన్ ఎస్ ఇ 50 ఇండెక్స్(S&P NSE50index(Nifty), మొదలైన వాటిలాగానే ఉంటాయి. ఈ పథకాలు ఒక సూచికలో పేర్కొన్న వాటికి గుర్తింపునిస్తూ వాటి సెక్యూరిటీల్లో మదుపు చేస్తాయి. ఈ పథకాల్లో ఎన్ ఎవిలు ఆ సూచికలో పేర్కొన్న సెక్యూరిటీల విలువ మెరుగుదల, తగ్గుదల ఆధారంగా హెచ్చుతగ్గులుగా ఉంటాయి. అయితే ఎప్పుడు ఎన్ ఎవిలు హెచ్చుతగ్గుల శాతం ఆ ఇండెక్స్ లలో ఉండనక్కరలేదు. ఎందుకంటే సాంకేతిక పరిభాషలో ట్రాకింగ్ ఎర్రర్(tracking error)అనే కారణం వల్ల ఆ హెచ్చుతగ్గుల శాతం ఇండెక్స్ ల పెరుగుదల తగ్గుదలలాగ ఉండనక్కరలేదు. ఈ అంశం గురించి అవసరమైన బహిరంగ ప్రకటనలు మ్యూచువల్ ఫండ్స్ పథకాల అమ్మకపు ఆహ్వాన (offer) పత్రంలో పేర్కొనడం జరుగుతుంది.

ఈ ఫండ్స్ మార్పిడి వ్యాపార ఇండెక్స్ ఫండ్స్ కూడాను (exchange traded index funds). ఈ ఫండ్స్ స్టాక్ ఎక్స్ చేంజ్ (stock exchange) ల మీదుగా వ్యాపారం చేసుకునేలాగా మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభిస్తాయి.

సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్/పథకాలు అంటే ఏమిటి?

అమ్మకపు ఆహ్వాన పత్రాలలో పేర్కొన్నట్టు ఆయా రంగాలు లేదా పరిశ్రమల్లో మాత్రమే ఉన్న సెక్యూరిటీలలో మదుపుచేసే నిధులు లేదా పథకాలను సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్ /పథకాలు అంటారు. ఉదాహరణకు ఫార్మాస్యుటికల్స్ (మందుల తయారీ పరిశ్రమ, సాఫ్ట్ వేర్ , ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (Fast moving consumer goods- FMGG), పెట్రోలియమ్ స్టాక్ లు మొదలైనవి ఈ ఫండ్ల మీద వచ్చే లాభాలు ఆయా రంగాలు/ పరిశ్రమలు పనితనం మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఫండ్ల మీద వచ్చే అధిక లాభాలు డైవర్శిఫైడ్ ఫండ్స్(అనేక రకాలుగా ఫండ్స్ ను పెట్టుబడులు పెట్టే ఫండ్స్- diversified funds) తో పోలిస్తే అధిక రీతిలో (సాహసం తో కూడినవి లేదా అపాయకరమైనవి-risky) గా ఉంటాయి. మదుపరులు ఈ ఫండ్స్ పెట్టుబడి పెట్టే రంగాలు/ పరిశ్రమల యొక్క పనితనం (సామర్ధ్యం) పై దృష్టి పెట్టుకోవలసిన అవసరముంది. సమయానుకూలంగా ఈ ఫండ్స్ నుంచి వైదొలగవలసి ఉంటుంది. ఈ విషయంలో వారు నిపుణుల సలహాలు పాటించడం మంచిది. 

టాక్స్ సేవింగ్ (పన్ను ఆదా) పథకాలు అంటే ఏమిటి?

ఈ పథకాలు పన్ను రాయితీలను కల్పిస్తూ మదుపరుల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తాయి. ఈ పన్ను రాయితీలు 1961 వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక అధికరణ (provisions) లకు లోబడి ఇవ్వబడతాయి. ఈ పథకాలలో ప్రభుత్వం పన్ను రాయితీలు మదుపరులకు కల్పించడానికి అనుమతినిచ్చింది. ఉదాహరణకు ఈక్విటీ జోడిత సేవింగ్స్ స్కీములు (Equity Linked Savings Schemes-ELSS) వంటివి. పొదుపు పథకాల మ్యూచువల్ ఫండ్స్ కు పన్ను రాయితీలు కల్పిస్తూ ప్రారంభించిన పెన్షన్ పథకాలు కూడా ఇటువంటివే. ఈ పథకాలు అభివృద్ధి సాధన మరియు ఈక్విటిల్లో మదుపుకు ప్రాబల్యం కల్పిస్తూ ఉండేవిగా ఉంటాయి. ఈ పథకాల అభివృద్ధి అవకాశాలు మరియు అపాయకరమైన సాహసాలతో(risky) కూడి ఈక్విటీ ఆధారిత పథకాలలాగానే ఉంటాయి. 

ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం అంటే ఏమిటి?

ఈ పథకం ప్రాథమికంగా తన మ్యూచువల్ ఫండ్స్ లోని ఇతర పథకాలలోగాని లేదా మరే ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో కాని మదుపు చేస్తే దానిని ఎఫ్ఒఎఫ్ (FOF) పథకం అని అంటారు. ఒకే పథకంలో మదుపరులు ఎక్కువ విధాలుగా(diversification)పెట్టుబడులు పెట్టుకునేందుకు ఈ ఎఫ్ఒఎఫ్(FOF) పథకం ఎంతో ఉపకరిస్తుంది. ఈ పథకం విస్తృతంగా రిస్క్( సాహసంతో కూడిన అపాయకరమైన) పరిస్థితులను వివిధరకాలుగా విస్తరిస్తుంది.

లోడ్ లేదా నో లోడ్ ఫండ్స్(Load/ No Load funds)అంటే ఏమిటి?

ఒక పథకంలో నుంచి వెలుపలికి రావడానికి , లేదా అందులో చేరడానికి ఎన్ ఎవిలో కొంత శాతం చార్జీలను వసూలు చేసే పథకాన్ని లోడ్ ఫండ్ అంటారు. అంటే ఈ ఫండ్స్ లో వాటా (యూనిట్లు) కొనుగోలుకు లేదా అమ్మకం చేసే ప్రతి ఒక్కనికి కొంత చార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఈ చార్జీలను మ్యూచువల్ ఫండ్స్ మార్కెటింగ్ మరియు పంపిణీ ఖర్చులుగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఒక వాటా ఎన్ఎవి పదిరూపాయలుకాగా ఈ పథకంలో చేరడానికి లేదా వెలుపలికి రావడానికి లోడ్ చార్జీలుగా 1 శాతం వసూలు చేస్తారు. అప్పుడు యూనిట్లు (వాటా) కొనుగోలు చేసే మదుపరులు 10 రూపాయలకు 10 పైసలు లోడ్ చార్జీలు చెల్లించాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కు తమ యూనిట్లను తిరిగి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించే మదుపరులు 9 రూపాయలకు 90 పైసలు ప్రతీ ఒక్క యూనిట్ కు పొందుతారు. కాబట్టి మదుపరులు మదుపు చేసే సమయంలో ఈ లోడ్ చార్జీలను పరిగణనలోనికి తీసుకుని తమకు వచ్చే లాభాలు / ఆదాయం పై వీటి ప్రభావం ఉంటుందన్న అవగాహన కల్పించుకోవాలి. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ అందించే సేవా ప్రమాణాలు ( Service Standards) మరియు పనితనం యొక్క ఫలితాలు (రికార్డు) పరిగణించడం కూడా అతి ముఖ్యం. లోడ్ లు ఉన్నప్పటికీ సమర్ధత కలిగిన ఫండ్స్ ఎక్కువ లాభాలు ఇచ్చేవిగా ఉంటాయి.

నో లోడ్ ఫండ్ (no load fund) అంటే ఆ ఫండ్ లోని పథకాల్లోంచి వెలుపలికి రావడానికి లేదా చేరడానికి ఎటువంటి చార్జీలు వసూలు చేయని ఫండ్ అని అర్ధం . అంటే ఈ ఫండ్ లోని పథకాల్లో చేరడానికి మదుపరులు ఎన్ఎవి ధర మీద చేరవచ్చు. అంటే మదుపరులు కొనుగోలు లేదా అమ్మకం చేసే వాటాలపై (యూనిట్లపై) ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించనక్కరలేదు.

అమ్మకపు ఆహ్వాన పత్రాలల్లో పేర్కొన్న స్థాయికి మించి లోడ్ ను హెచ్చించి కాని లేదా సరికొత్త లోడ్ కు కాని మ్యూచువల్ ఫండ్ వసూలు చేయవచ్చా?

అమ్మకపు ఆహ్వాన పత్రంలో పేర్కొన్న స్థాయికి మించి లోడ్ ను మ్యూచువల్ ఫండ్ పెంచకూడదు. ఏమైనా మార్పు చేయదలిస్తే కొత్తగా చేసే పెట్టుబడులకు మాత్రం ఆ మార్పులు వర్తిస్తాయి తప్ప అసలు పెట్టుబడులకు వర్తించవు. కొత్త లోడ్ లు వసూలు చేయడం కాని లేదా ఉన్న(గత) లోడ్ లను పెంచడం కాని చేయదలిస్తే మ్యూచువల్ ఫండ్స్ అమ్మకపు ఆహ్వానపత్రాలలో తగిన సవరణలు చేయాలి. ఈ విధానం వల్ల కొత్త మదుపరులు తాము మదుపు చేసే సమయంలో ఈ లోడ్ లను గురించి అవగాహన కల్గి ఉంటారు.

లాభాల హామీ ఇచ్చే పథకం అంటే ఏమిటి?

లాభాలు హామీ ఇచ్చే పథకాలు అంటే పథకం పనితనంతో సంబంధం లేకుండా వాటాదారుల (యూనిట్ హోల్డర్ల)కు నిర్ధిష్ట లాభాలు హామీ ఇచ్చి ఆ లాభాలను చెల్లించే పథకాలను హామీ లాభాల పథకమని అంటారు.

మదుపరులు ఆహ్వాన పత్రాన్ని క్షుణ్ణంగా చదివి ఈ లాభాలు పథకం వర్తించే పూర్తి సమయం(గడువు)కు ఇవ్వబడతాయి. లేదా కొంత సమయానికి (కొన్నాళ్ళకు) ఇవ్వబడతాయా అని తెలుసుకోవాలి. కొన్ని పథకాలు ఒక సంవత్సరానికి ఒక దఫా మాత్రమే లాభాలు ఇస్తామని హామీ ఇస్తాయి. ఈ పథకాలు పునః సమీక్షించి మరుసటి సంవత్సరం ప్రారంభంలో మార్పులు చేస్తాయి.

మదుపరుల నిధులను (సొమ్మును) పెట్టుబడి పెట్టి విస్తరించే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల కేటాయింపును మార్చుకోవచ్చా?

మార్కెట్ పంధాను పరిగణించి, దూరదృష్టి కల్గిన నిర్వాహకులు ఆస్తుల కేటాయింపును మార్చుకోవచ్చు. అమ్మకపు ఆహ్వాన పత్రంలో బహిరంగపరచిన రీతికి భిన్నంగా వివేకంగల ఫండ్ మేనేజర్ (ఫండ్ నిర్వాహకుడు) ఈక్విటీ లేదా డెట్ పత్రాల్లో ఎక్కువ లేదా తక్కువ తరహా ఫండ్ ను మదుపు చేయవచ్చును. భద్రతను పరిగణించి అతడు స్వల్ప కాల వ్యవధి ఆధారంగా ఈ చర్యలు చేపట్టవచ్చు. అంటే ఎన్ఎవి ని రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టవచ్చు. మదుపరుల శ్రేయస్సును పరిగణనలోనికి తీసుకుని అతని అస్సెట్ కేటాయింపులలో మార్పులు చేయుటకు కొంత మేరకు సడలింపు కోసం ఫండ్ మేనేజర్లకు అనుమతి ఇవ్వబడింది. అయితే మ్యూచువల్ ఫండ్స్ అస్సెట్ కేటాయింపులను శాశ్వత స్థాయిలో మార్పు చేయుటకు యూనిట్ హోల్డర్ల (వాటాదారుల) కు ముందుగా తెలియపరచవలసిన అవసరముంది. అంతేగాక మదుపరులకు ఈ పథకం నుంచి వెలుపలికి పోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్ఎవి లపై ఎటువంటి లోడ్ వసూలు చేయకుండా వారి ఐచ్చికతకు అవకాశం కల్పించాలి.

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క పథకంలో ఎలా మదుపు చేయాలి?

కొత్త పథకాలను ఫలానా తేదీ నుంచి ప్రారంభించుచున్నట్లు మ్యూచువల్ ఫండ్ లు సాధారణంగా వార్తా పత్రికలలో ప్రకటనల ద్వారా తెలియజేస్తాయి. దరఖాస్తు ఫారాలు మరియు తమకు అవసరమైన సమాచారం పొందేందుకు మదుపరులు మ్యూచువల్ ఫండ్ యొక్క పంపిణీ దారులు మరియు ఫండ్స్ ప్రతినిధులను సంప్రదించవచ్చు. పంపిణీదారులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉంటారు. ఫండ్స్ యొక్క ప్రతినిధులు పంపిణీదారులు దరఖాస్తు ఫారాలనందించే సేవలు చేస్తారు. వారి వద్ద మదుపరులు దరఖాస్తు ఫారాల ద్వారా సొమ్ము జమ (డిపాజిట్) చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్లను ప్రస్తుతం తపాలా కార్యాలయాలు, బ్యాంకులు కూడా పంపిణీ చేస్తున్నాయి. అయితే తపాలా కార్యాలయాలు, బ్యాంకులు అందించే ఈ సేవలను మదుపరులు బ్యాంకులు, తపాలా కార్యాలయాల యొక్క స్వంత పథకాలుగా భావించరాదు. అందుచేత ఈ పథకాలపై వచ్చే లాభాలు (returns) బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఇస్తాయన్న హామీ ఆ సంస్థల నుంచి పొందుతాయనుకోరాదు. మదుపరులకు మ్యూచువల్ ఫండ్స్ యొక్క పథకాలను పంపిణీ చేసేందుకు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు సహాయం చేయడం వరకే వారి పని అని గ్రహించాలి.

ఒక ప్రత్యేక పథకంలో మదుపు చేసేందు కోసం పంపిణీ దారులు / ప్రతినిధులు ఇచ్చే బహుమతులు, కమీషన్లను మదుపరులు తీసుకొనరాదు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క పనితీరును పరిగణనలోకి తీసుకుని వాటి నిర్ణయాత్మక ఉద్దేశాలను మాత్రమే మదుపరులు గమనించాలి.

మ్యూచువల్ ఫండ్స్ లో ప్రవాస భారతీయులు (NRI) మదుపు చేయవచ్చా?

అవును. ఎన్ఆర్ఐ ((ప్రవాస భారతీయులు) లు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన అవసరమైన వివరాలను పథకాల యొక్క అమ్మకపు ఆహ్వాన పత్రాలలో ఇవ్వబడతాయి. 

డెట్ లేదా ఈక్విటీ ఆధారిత పథకాల్లో ఒకరు ఎంత సొమ్ము మదుపు చేయవచ్చు?

ఒక మదుపరి తన యొక్క సాహసంతో కూడిన (risk taking capacity) అపాయాన్ని ఎదుర్కొనే సామర్ధ్యం , వయస్సు, ఆర్ధికస్తోమతలు మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని మదుపు చేయవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ పథకాలు వివిధ రకాల సెక్యూరిటీలలో మదుపు చేస్తాయి. ఈ విషయాలను అమ్మకపు ఆహ్వాన పత్రాలలో పేర్కొంటారు. అందుచేత వివిధ రకాల సెక్యూరిటీలలో వివిధ రకాల లాభాలు మరియు ప్రమాదాలు ఉంటాయి. మదుపరులు తాము నిర్ణయాలు తీసుకునే ముందుగా ఆర్ధిక నిపుణులతో కూడా సంప్రదించవచ్చును. ఈ అంశం పై ప్రతినిధులు, పంపిణీదారులు కూడా తమ వంతు సహాయం అందిస్తారు. 

మ్యూచువల్ ఫండ్ యొక్క పథకాల్లో దరఖాస్తు ఫారం నింపడం ఎలా?

దరఖాస్తు ఫారంలో పేర్కొన్నటు వంటి అవసరమైన సమాచారంతోబాటు, దరఖాస్తుదారు పేరు, చిరునామా, ఎన్ని యూనిట్ల కోసం దరఖాస్తు చేస్తున్నారో తదితర వివరాలను దరఖాస్తుదారు స్పష్టంగా తెలియజేయాలి. దరఖాస్తుదారు తన యొక్క బ్యాంకు ఖాతా నెంబరు కూడా వ్రాయాలి.ఎందుకంటే భవిష్యత్ లో మ్యూచువల్ ఫండ్ వారు డివిడెండ్(లాభాల వాటా) ఇచ్చి నప్పుడు కాని లేదా యూనిట్లను తిరిగి కొనుగోలు చేసేటప్పుడు కాని జారీ చేసే చెక్కు/ డ్రాఫ్ట్ లు మోసపూర్వకంగా నగదుగా మార్చుకోవడాన్ని అరికట్టేందుకు ఈ బ్యాంకు ఖాతానెంబరు ఇవ్వడం తప్పనిసరిగా భావించాలి. మ్యూచువల్ ఫండ్ ను తర్వాత కాలంలో దరఖాస్తుదారు చిరునామాలో మార్పు, బ్యాంకు ఖాతా నెంబరు మార్పు మొదలైన వాటిని వెంటనే తెలియజేయాలి. 

అమ్మకపు ఆహ్వానపత్రంలో మదుపరి పరిశీలించవలసిన అంశాలు ఏమిటి?

సంక్షిప్త అమ్మకపు ఆహ్వానపత్రంలో పెట్టుబడి పెట్టే రాబోవు మదుపరులకు ఉపయోగపడే అవసరమైన అతి ముఖ్య సమాచారమును మ్యూచువల్ ఫండ్స్ అందించవలసి ఉంటుంది. అమ్మకపు ఆహ్వానపత్రంలో ఒక పథకంలో చేరేందుకు అవసరమైన దరఖాస్తు ఫారం ఒక ముఖ్య భాగమై ఉంటుంది. అమ్మకపు ఆహ్వానపత్రంలో బహిరంగ పరచవలసిన కనీస అంశాలను సెబి నిర్దేశించింది. ఒక పథకంలో మదుపు చేసే ముందుగా మదుపరి అమ్మకపు ఆహ్వాన పత్రాన్ని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. పథకం యొక్క ముఖ్య లక్షణాలకు సంబంధించిన అంశాలపై అతి జాగ్రత్త వహించాలి. అంటే రిస్క్ అంశాలు, ప్రాథమిక జారీ ఖర్చులు మరియు పథకంలో మరల మరల వసూలు చేసే ఖర్చులు పథకంలో చేరడానికి , తొలగడానికి వసూలు చేసే లోడ్ లు, స్పాన్సర్ ట్రాక్ రికార్డ్ పట్ల జాగ్రత్త వహించాలి. అంతేగాక ఫండ్ లో ముఖ్యమైన వ్యక్తులైన ఫండ్ మేనేజర్ల వంటి వారి విద్యా యోగ్యతలు పనిలో వారి పూర్వానుభవము పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అలాగే మ్యూచువల్ ఫండ్ గతంలో నిర్వహించిన ఇతర పథకాల యొక్క పని సామర్ధ్యం, మ్యూచువల్ ఫండ్స్ పై వాయిదాపడిన వ్యాజ్యాలు (litigations) మరియు విధించిన అపరాధరుసుము (పెనాల్టి) మొదలైన వాటి గురించి జాగ్రత్త పడాలి. 

మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసిన తర్వాత మదుపరి సర్టిఫికేట్ కాని లేదా తన యొక్క అక్కౌంట్ స్టేట్ మెంట్ కాని ఎప్పుడు పొందగలడు?

మ్యూచువల్ ఫండ్స్ ప్రకటించిన పథకం యొక్క ప్రాథమిక పెట్టుబడుల స్వీకరణ గడువు ముగిసిన నాటి నుంచి 6 వారాలలోపు మదుపరులకు సర్టిఫికేట్లు లేదా అక్కౌంట్ స్టేట్ మెంట్లు పంపబడతాయి. కాలపరిమితితో కూడిన పథకం విషయంలో మదుపరులకు డిమాట్ అక్కౌంట్ స్టేట్ మెంట్ (DEMAT account statement) కాని యూనిట్ సర్టిఫికేట్లు కాని పొందుతారు. ఎందుకంటే ఈ పథకాలకు స్టాక్ ఎక్స్ చేంజ్ (stock exchange) లలో వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి కాల పరిమితి లేని పథకం విషయంలో మ్యూచువల్ ఫండ్ పథకం బహిరంగ ప్రకటన ద్వారా ప్రాథమిక పెట్టుబడుల స్వీకరణ గడువు ముగిసిన 30 రోజులలోపు అక్కౌంట్ స్టేట్ మెంట్లు పంపుతుంది. అమ్మకపు ఆహ్వాన పత్రంలో తిరిగి కొనుగోలు చేసే విధానం గురించి వివరింపబడుతుంది.

కాలపరిమితితో కూడిన పథకాలలో స్టాక్ మార్కెట్ల నుండి యూనిట్లు కొనుగోలు చేసిన తర్వాత ఎంత కాలానికి యూనిట్ల్ బదిలీ జరుగుతుంది?

సెబి (SEBI) నియమ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్ లాడ్జ్ మెంట్ (lodgment) సర్టిఫికేట్లు జారీ అయిన తేదీ నుంచి నెలలోపు (ముప్పై రోజులలోపు) యూనిట్లను బదిలీ చేయవలసి ఉంటుంది.

యూనిట్ హోల్డర్ అయిన పిదప డివిడెండ్లు (లాభాల వాటా) లేదా తిరిగి కొనుగోలు చేసిన యూనిట్ల పై వచ్చే సొమ్ము పొందడానికి ఎంత కాలం పడుతుంది?

డివిడెండ్ ప్రకటించిన ముప్పై రోజులలోపు యూనిట్ హోల్డర్లకు డివిడెండ్ వారెంట్లను మ్యూచువల్ ఫండ్ పంపవలసి ఉంటుంది. అలాగే వాటాదారు కోరిక మేరకు వాటాను తిరిగి కొనుగోలు చేసిన తర్వాత కాని లేదా యూనిట్ల విడుదల (redemption) నిర్వహించిన తేదీ నుంచి కానీ 10 పనిరోజులలోపు తిరిగి కొనుగోలు చేసిన లేదా విడుదల (redemption) సొమ్ము పంపడం జరుగుతుంది.

విడుదల కల్గించిన / లేదా తిరిగి కొనుగోలు చేసిన యూనిట్ల సొమ్మును నిర్ణయించిన గడువు లోపు పంపడంలో విఫలమైన పక్షంలో అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీ (Asset management company) సెబి (SEBI) తీసుకునే కాలానుగుణమైన వడ్డీ రేట్ల ప్రకారం వడ్డీని (15 శాతం ప్రస్తుతం వడ్డీ రేటు) చెల్లించవలసి ఉంటుంది.

అమ్మకపు ఆహ్వానపత్రంలో పేర్కొన్న ఒక పథకం యొక్క లక్షణాలను మ్యూచువల్ ఫండ్ మార్పు చేయవచ్చా?

చేయవచ్చు. అయితే పథకం యొక్క నియమ నిబంధనల లక్షణాలను మార్చకుండా అంటే పథకం యొక్క మౌలికాంశాలను ఉదాహరణకు రూపం, పెట్టుబడుల తీరు మొదలైన వాటిని మార్చుకోవచ్చు. అయితే ఈ మార్పు విషయాన్ని ప్రతి ఒక్క వాటాదారుకు తెలియపరచాలి లేదా దేశ వ్యాప్తంగా చెలామణి కల్గిన ఆంగ్ల పత్రికలో ప్రకటన ప్రచురణ ద్వారా తెలియపరచాలి. అలాగే మ్యూచువల్ ఫండ్ ప్రధాన కార్యాలయంగల ప్రాంతం నుంచి ప్రచురింపబడుతున్న ప్రాంతీయ భాషా పత్రికలో ప్రకటన ప్రచురణ ద్వారా కూడా తెలియ పరచాలి. ఈ పథకంలో ఉండడానికి ఇష్టం లేని వాటాదారు ఎటువంటి ఎక్జిట్ లోడ్ లేకుండా ప్రస్తుతం అమలులో ఎన్ఎవి వద్ద తొలగడానికి (వెళ్లి పోవడానికి) యూనిట్ హోల్డర్లకు హక్కు కలదు. స్పా న్సర్ మార్పు చెందిన సందర్భంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇదే విధానాన్ని అనుసరించవలసిన అవసరముంది. అలాగే పథకం యొక్క రూపాన్ని కాల పరిమితితో కూడిన పథకం నుంచి కాల పరిమితిలేని పథకంగా మార్చినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ లో వస్తున్న మార్పులను గురించి మదుపరులు ఎలా తెలుసుకోగలరు?

మ్యూచువల్ ఫండ్ లో కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. తమ ఫండ్ లో ఏవైనా ద్రవ్యంకు సంబంధించిన (material) మార్పులు కనుక అవసరమైతే ఆ సమాచారాన్ని యూనిట్ హోల్డర్లకు మ్యూచువల్ ఫండ్ తెలియజేయాలి. ఇదేకాక ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క మదుపరులకు త్రై మాసిక వార్తా సమాచారాలను లేఖల ద్వారా తెలియజేస్తాయి. ప్రతి రెండేళ్ళకు కనీసం ఒక్కసారైనా అమ్మకపు ఆహ్వాన పత్రాల్లోని అంశాలను సవరించి ఆ రోజు నాటికి ఉన్న అంశాలను తెలియపరచవలసిన అవసరం ప్రస్తుతం అమలులో ఉంది. ఇది ఇలా ఉండగా, మ్యూచువల్ ఫండ్ పథకంలో ద్రవ్యానికి సంబంధించి చేసిన మార్పులు గురించి అమ్మకపు ఆహ్వాన పత్రం సవరించి తిరిగి ప్రచురించే సమయం వరకు ఈ మార్పుల అంశంతో కూడిన సమాచారం కలిగిన అదనపు(అనుబంధ) పత్రాన్ని(addendum) ప్రస్తుత అమ్మకపు ఆహ్వాన పత్రంకు జత చేసి కొత్త మదుపరులకు అందించాలి.

Mutual Funds

మీరు నేరుగా కంపెనీల స్టాక్లలో పెట్టుబడి పెట్టాలా లేదా మ్యూచువల్ ఫండ్లను కొనాలా? ఏ ఎంపిక మీకు ఎక్కువ “అనుకూలమైనది”? 

చాలా మంది పెట్టుబడిదారులు తాము నేరుగా షేర్లలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తారు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అదే చేస్తుంది, అయితే స్టాక్ ఇన్వెస్టింగ్ పూర్తిగా చాలా భిన్నమైన గేమ్ మరియు డైనమిక్స్ అక్కడ చాలా భిన్నంగా ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం.

mf vs stocks
mf vs stocks

#1 . Knowledge Required

                  చాలా మంది ప్రజలు స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం చాలా సులభం అని అనుకుంటున్నారు, హాట్ టిప్స్‌ను ఉపయోగించి కొన్ని స్టాక్‌లను కొనుగోలు చేసి, ఆపై స్టాక్ కొన్ని నెలల / సంవత్సరాల్లో మల్టీబ్యాగర్ అయ్యే వరకు వేచి ఉండాలి. అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులకు మాత్రమే ఇది సాధ్యం. 

                        స్టాక్ ఇన్వెస్టింగ్ ఎలా చేయాలో అధ్యయనం చేయడానికి తమ జీవిత సమయాన్ని గడిపిన పెట్టుబడిదారులు ఉన్నారు మరియు ఇప్పటికీ వారు పెద్ద తప్పులు చేస్తారు.  సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్లను అధ్యయనం చేయడానికి మరియు భవిష్యత్తు కోసం సరైన స్టాక్లను ఎంచుకోవడానికి గొప్ప జ్ఞానం మరియు నైపుణ్యం అవసరమని వారికి తెలుసు.  కాబట్టి విషయానికి వస్తే, స్టాక్ పెట్టుబడి పిల్లల ఆట కాదు. 

                               సరైన స్టాక్‌లను ఎంచుకోవడానికి చాలా సంవత్సరాల కృషి మరియు చాలా జ్ఞానం అవసరం. నిజానికి, స్టాక్ పెట్టుబడిని అధ్యయనం చేయడానికి ఎక్కువ సమయం గడపలేని పెట్టుబడిదారుల కోసం మ్యూచువల్ ఫండ్స్ ఒక ఉత్పత్తిగా సృష్టించబడ్డాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి విషయానికి వస్తే మీకు ఎక్కువ స్టాక్ మార్కెట్  జ్ఞానం అవసరం లేదు.

                 మీరు కొన్ని ప్రాథమిక నియమాలను ఉపయోగించి మీ స్వంతంగా “సహేతుకమైన మంచి” మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు లేదా మీ కోసం దీన్ని చేయగల advisor  ని నియమించుకోవచ్చు.

#2 . No control on stocks chosen

మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు, ఏ స్టాక్స్ లోపలికి వెళ్తాయో మరియు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళడాన్ని మీరు నియంత్రించలేరు. అది ఫండ్ మేనేజర్ ఉద్యోగం.

 మీరు మ్యూచువల్ ఫండ్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టండి మరియు మీ డబ్బును ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్‌కు ఇవ్వండి. కాబట్టి ఫండ్ మేనేజర్ ఎంచుకున్న స్టాక్స్‌పై మీకు ZERO నియంత్రణ ఉంటుంది. 

అయితే మీరు ప్రత్యక్ష స్టాక్ పెట్టుబడి చేసినప్పుడు, మీరు ఫండ్ మేనేజర్ మరియు దానిపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. కాబట్టి మీ అధ్యయనం, గట్ ఫీలింగ్, లాజిక్,  హాట్ టిప్స్ ఆధారంగా, మీరు స్టాక్‌లను కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్ల విషయంలో అలా కాదు. స్టాక్స్ కొనడం మరియు అమ్మడం అనేది తెలిసిన ప్రొఫెషనల్ నిర్ణయం తీసుకునే వ్యక్తి ఆట.

#3 . Professional Fund Manager

విమానం ఒక వైద్యుడు చేత నడిపితే అది క్రాష్ అయ్యే  అవకాశం ఉంది. విమానాన పైలట్ నడపడానికి మరియు డాక్టర్ నడపడానికి మధ్య తేడా ఉంది. 

ఈక్విటీల విషయానికి వస్తే అదే జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ చాలా అధిక నాణ్యత మరియు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చేత నిర్వహించబడుతుంది, అతను దేశాల ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక విశ్లేషణ,, క్రెడిట్ circle, వడ్డీ రేట్ల చక్రం, పన్నులు, వ్యాపారాలు వంటి వివిధ విషయాల గురించి సంవత్సరాల జ్ఞానం కలిగి ఉంటాడు మరియు వివిధ రకాల ఈక్విటీ మార్కెట్ల అనుభవం కలిగి ఉంటాడు. 

వారు Asset management సంబంధించిన వృత్తిపరమైన అధ్యయనాలను పూర్తి చేశారు.

ఏ స్టాక్‌ను కొనాలి లేదా అమ్మాలి అనే దానిపై వారు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వారికి రంగాలు మరియు ఆ వ్యాపారం గురించి చాలా లోతైన అవగాహన ఉంటుంది. వారు సంస్థలను, వారి కర్మాగారాలను సందర్శిస్తారు మరియు వారి ఉన్నత నిర్వహణను కలుస్తారు. కంపెనీలలో ఏమి జరుగుతుందనే దానిపై వారికి అవహగానా ఉంటుంది  మరియు సాధారణ వ్యక్తితో పోలిస్తే కంపెనీల భవిష్యత్తును ఉహించగలరు. 

ఏదేమైనా, చాలా మంది ఈక్విటీ పెట్టుబడిదారులు తాము దీర్ఘకాలంగా గొప్ప నైపుణ్యంతో ప్రత్యక్ష స్టాక్లలో విజయవంతంగా పెట్టుబడి పెట్టవచ్చని మరియు ప్రొఫెషనల్ మేనేజర్ మాదిరిగానే గొప్ప రాబడిని పొందవచ్చని భావిస్తున్నారు. టి

సిఎస్ లేదా ఇన్ఫోసిస్ వద్ద క్యూబికల్‌లో కూర్చున్న ఐటి ఇంజనీర్ తప్పనిసరిగా హాట్ టిప్స్ ఆధారంగా కొన్ని స్టాక్‌లను కొనుగోలు చేయవచ్చు, కాని ఫండ్ హౌస్‌లలో కోట్ల వేతనాలు సంపాదించే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ యొక్క నైపుణ్యంతో సరిపోలలేదు.

#4. Volatility & Return

ఇది చాలా ముఖ్యమైన విషయం, అందువల్ల చాలా జాగ్రత్తగా చదవండి. మీరు మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు 30-100 కంపెనీల నుండి వేర్వేరు స్టాక్‌ల యొక్క చాలా పెద్ద పోర్ట్‌ఫోలియోను పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి మీ లాభాలు మరియు నష్టాలు పెద్ద సంఖ్యలో స్టాక్‌లపై ఆధారపడి ఉంటాయి, అందువల్ల రిస్క్ ఆ స్టాక్‌ల మధ్య పంపిణీ చేయబడుతుంది మరియు అదే విధంగా మీకు లభించే రాబడి ఆ అన్ని స్టాక్‌ల సగటు గా ఉంటుంది.

 సంక్షిప్తంగా, చిన్న 4-10 స్టాక్ పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే తక్కువ రిస్క్ మరియు తక్కువ రిటర్న్ ప్రాబబిలిటీ ఉంది. 

మీరు ప్రత్యక్ష స్టాక్ పెట్టుబడిదారుగా ఉన్నప్పుడు, మీ పోర్ట్‌ఫోలియో నుండి వచ్చే రాబడి ఎంత అస్థిరమో మీరు ఎన్ని స్టాక్‌లను కొనుగోలు చేస్తారు. చాలా మంది ఈక్విటీ పెట్టుబడిదారులు చాలా తక్కువ స్టాక్‌లపై పందెం వేస్తారు, వారు 5-10 స్టాక్‌లను మాత్రమే కొనుగోలు చేస్తారు (కొన్ని సార్లు 2-3 మాత్రమే). కాబట్టి ప్రతి స్టాక్ పరిమాణం పోర్ట్‌ఫోలియోలో చాలా పెద్దది మరియు ఏదైనా మార్పు (పైకి లేదా క్రిందికి) మొత్తం పోర్ట్‌ఫోలియో రాబడిని ప్రభావితం చేస్తుంది.

 చాలా మంది పెట్టుబడిదారులు చాలా ఎక్కువ రాబడిని లేదా అధిక నష్టాన్ని నిర్వహించడానికి సిద్ధంగా లేరు. చాలా భారీ రాబడి ఉంటే, పెట్టుబడిదారులు తమ స్టాక్‌లను అమ్మేసి, లాభాలను లాక్ చేయాలనుకుంటున్నారు మరియు అదే విధంగా బాగా నష్టపోతుంటే, వారు దానిని విక్రయించి “రిస్కీ” గేమ్ నుండి బయటపడాలని కోరుకుంటారు. రెండు సందర్భాల్లో, పెట్టుబడిదారులు ఆటలో ఉండటానికి బదులు బయటపడాలని మరియు పక్కపక్కనే వేచి ఉండాలనే కోరికను అనుభవిస్తారు – ఎందుకంటే ఇది నిర్వహించడానికి మానసికంగా చాలా ఎక్కువ. 

గత 10 సంవత్సరాలక గా మ్యూచువల్ ఫండ్ ఉన్న పెట్టుబడిదారులను మీరు చూడడానికి ఇది ఖచ్చితంగా ఒక కారణం, కానీ మీరు 10 సంవత్సరాల పాటు ఒకే స్టాక్ కలిగి ఉన్న వారిని చాలా అరుదుగా చూస్తారు.

 రెండు సందర్భాల్లో, పెట్టుబడిదారులు ఆటలో ఉండటానికి బదులు బయటపడాలని మరియు పక్కనే వేచి ఉండాలనుకుంటారు.

#5. Automatic Investments (SIP)

మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు, SIP అని పిలువబడే ఆటోమేటిక్ ఇన్వెస్టింగ్ యొక్క సౌకర్యం ఉంది. మీ పెట్టుబడిని ఆటోమేట్ చేయడానికి మరియు సాధారణ పెట్టుబడి అలవాటును సృష్టించడానికి ఇది ఒక గొప్ప మార్గం. 

ఇచ్చిన తేదీన ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారుడికి ఇది సరిపోతుంది. అయితే మీరు స్టాక్‌లను కొనుగోలు చేసేటప్పుడు, మీరు ప్రతి నెలలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరు ప్రతి స్టాక్‌లో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టాలి. 

ఇది ఆచరణాత్మకంగా సవాలుగా మరియు అసమర్థంగా మారుతుంది ఎందుకంటే డిజైన్ ప్రకారం మానవ మనస్సు సోమరితనం. మీరు ఎన్ని రిమైండర్‌లను సెట్ చేసినా, ఎంత “కట్టుబడి” ఉన్నా, కొన్ని నెలల పెట్టుబడి తర్వాత వదిలేస్తాం.

#6.80C Benefits

ప్రత్యక్ష స్టాక్ పెట్టుబడికి 80 సి పన్ను ప్రయోజనాలు లేవు, అయితే మీరు ELSS (పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్) లో పెట్టుబడి పెడితే, మీరు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. మీరు స్టాక్‌ల కంటే మ్యూచువల్ ఫండ్లను ఇష్టపడటానికి ఇది ఒక చిన్న కారణం.

#7. Active vs. Passive Involvement

స్టాక్ మార్కెట్ పై అవగాహన లేని మరియు  సమయం లేని పెట్టుబడిదారుల కోసం మ్యూచువల్ ఫండ్స్ తయారు చేయబడతాయి. 

మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టిన తర్వాత, కాలక్రమేణా నిధులను నిర్వహణలో మీ ప్రమేయం చాలా పరిమితం. 

ఏ స్టాక్ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి అనే ముఖ్యమైన నిర్ణయాలు ఫండ్ మేనేజర్ మరియు 5-20 పరిశోధన విశ్లేషకుల అతని ప్రత్యేక బృందం చూసుకుంటాయి.

       అయితే, మీరు నేరుగా షేర్లలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటే, ఇవన్నీ మీరే చేయాలి. 

ఇది డే ట్రేడింగ్ లాగా అలసిపోకపోయినా, ఇప్పటికీ మీరు కంపెనీలను అధ్యయనం చేయాలి, మీ పోర్ట్‌ఫోలియోలోని ప్రతి కంపెనీలతో ఏమి జరుగుతుందో ట్రాక్ చేయాలి, మీ భావోద్వేగాలను నియంత్రించాలీ (మ్యూచువల్ ఫండ్లకు కూడా నిజం) .

 సంక్షిప్తంగా, మీరు ప్రత్యక్ష స్టాక్ పెట్టుబడిలో చాలా చురుకుగా ఉండాలి. జీవితంలో చాలా విషయాలు ఉన్నందున స్టాక్ పెట్టుబడిపై దృష్టి పెట్టడం చాలా కష్టం.

#8. Fees and Cost

             మీరు నేరుగా స్టాక్‌లను కొనుగోలు చేసినప్పుడు, మీరు STT తో పాటు డీమాట్ ఖాతా ఛార్జీలు మరియు ఏదైనా ఉంటే లావాదేవీ ఛార్జీలు మాత్రమే చెల్లించాలి. 

                 అయితే మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు ఎక్సపెన్స్ రేషియో రుసుము చెల్లించాలి. ఇది నిధుల నుండి రోజువారీగా వసూలు చేయబడే రుసుము, అయితే మీరు దీన్ని మీరే చూడలేరు మరియు ప్రచురించబడిన అన్ని NAV లు  ఎక్సపెన్స్ రేషియో తీసివేసిన తరవాతవి.

 ఈ ఛార్జీలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు 2-2.5% పరిధిలో ఉంటాయి (డెట్ ఫండ్లకు తక్కువ ఛార్జీలు). 

మీ సంపద సృష్టి ప్రక్రియలో ఫండ్ మేనేజర్ మీ కోసం విలువను సృష్టించగలిగితే ఫీజు చెల్లించడానికి ఎటువంటి హాని లేదు

 మీరు మ్యూచువల్ ఫండ్స్ వంటి రాబడిని మీరే పొందగలిగితే. మీరు విజయవంతంగా స్టాక్ ఇన్వెస్టింగ్ మీ స్వంతంగా చేయగలిగితే, మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెట్టుబడి పెట్టడం లోఅర్ధమే లేదు.

#9.Emotional Bias

మీరు చేసే పరిశోధన మరియు అధ్యయనం ఆధారంగా మీరు స్టాక్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు తప్పు చేశారని అంగీకరించడం చాలా కష్టమవుతుంది. 

మీ కొనుగోలు నిర్ణయం గురించి మీరు చాలా పక్షపాతంతో ఉంటారు మరియు సరైన సమయంలో అమ్మరు. స్టాక్ కొనుగోలు నిర్ణయాన్ని విశ్వసించినందుకు మీరు గతంలో ఇడియట్ అని అంగీకరించడం చాలా కష్టం మరియు సరైన సమయం వచ్చినప్పుడు అమ్మరు. 

చెడు ఈక్విటీ పెట్టుబడులతో పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడిదారులుగా మారడానికి ఇది ఖచ్చితంగా కారణం. వారు చాలా సంవత్సరాలు చెడు పెట్టుబడులతో ఉంటారు మరియు చివరికి వదులుతారు. ఇది మీ డబ్బు మరియు ఇది మీ నిర్ణయం.

అయితే మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు, అన్ని నిర్ణయాలు ఒక ప్రొఫెషనల్ చేత తీసుకోబడతాయి, అతను పనితీరు కోసం జీతం పొందుతున్నాడు. 

వారు తర్కం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు మరియు భావోద్వేగాలను వారి వ్యవస్థ నుండి దూరంగా ఉంచుతారు. వారి ప్రక్రియ “అమ్మండి” అని చెబితే, వారు దానిని అమ్ముతారు. అది “కొనండి” అని చెబితే, వారు దాన్ని కొంటారు!

Conclusion

చివరగా, నేరుగా స్టాక్స్‌తో మరియు అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్‌తో వెళ్లడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఏదేమైనా, ప్రత్యక్ష స్టాక్ పెట్టుబడి అనేది ఆడటానికి ఒక ప్రత్యేకమైన ఆట మరియు ఇది అందరి cup of tea టీ కాదు. 

సంపద సృష్టితో కోసం సురక్షితంగా ఆడాలనుకునేవారు, ప్రత్యక్ష ఈక్విటీలలో వేళ్లు కాల్చుకోవడానికి ప్రయత్నించకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎన్నుకోవాలి.

Mutual Funds

మనలో చాలా మంది పన్ను ఆదా ప్రయోజనాల కోసం మ్యూచువల్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెడతారు. వీటిని ELSS ఫండ్స్ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అంటారు. అయితే, ఈ పోస్ట్‌లో, మీరు అలాంటి ఉత్పత్తులకు దూరంగా ఉండటానికి గల కారణాలను మీతో పంచుకుంటున్నాను.

మీకు తెలిసి ఉండవచ్చు, ELSS నిధులు Sec.80C కింద రూ .1,50,000 వరకు తగ్గింపుకు అర్హులు. అలాగే, ELSS మ్యూచువల్ ఫండ్స్ కోసం 3 సంవత్సరాల లాక్-ఇన్ ఉంది. మీరు SIP ని ఎంచుకుంటే, ప్రతి నెలవారీ SIP ఉపసంహరణకు అర్హత పొందడానికి 3 సంవత్సరాలు పూర్తి చేయాలి.

Why tax savers love ELSS Mutual Funds?

# అన్ని ఇతర ఎంపికలలో అతి తక్కువ లాక్-ఇన్: – Sec.80C లో లభించే ఇతర పన్ను ఆదా సాధనాలతో పోల్చినట్లయితే, ELSS ఫండ్లకు 3 సంవత్సరాల లాక్-ఇన్ ఉంటుంది. అయితే, ఇతర ఎంపికలలో కనీసం 5 సంవత్సరాలు ఉండాలి. ELSS మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడానికి ఇది ప్రాథమిక కారణం. 

#Last minute tax saving

ఈ ELSS వెనుక నడవడానికి మరో కారణం ప్రణాళిక లేని చివరి నిమిషంలో పన్ను ఆదా రష్. అందువల్ల, ప్రమాద కారకాల గురించి చింతించకుండా పెట్టుబడికి దూకుతాము.

PAST performance

ఈ పెట్టుబడిదారులలో ఎక్కువమంది గత రాబడిని తిరిగి చూస్తారు మరియు పనితీరు అద్భుతంగా ఉంటే, అప్పుడు ELSS తీసుకుంటారు.

Mutual Funds for Tax Saving – Why you must avoid?

ఇప్పుడు ఈ పోస్ట్ యొక్క ప్రధాన అంశానికి వద్దాం. సెబీ యొక్క నిర్వచనం ప్రకారం, ELSS ఫండ్స్ అంటే “ఈక్విటీ & ఈక్విటీ సంబంధిత సాధనాలలో కనీస పెట్టుబడి – మొత్తం ఆస్తులలో 80% (ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, 2005 ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది”. ఇప్పుడు నేను చర్చించే సమస్యలను చర్చించుకుందాం పన్ను ఆదా కోసం మ్యూచువల్ ఫండ్స్ ELSS ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి మీ ప్రాధాన్యత ఎందుకు కాదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.

# Full FREEDOM to Fund Manager

ELSS మ్యూచువల్ ఫండ్స్ యొక్క నిర్వచనాన్ని మీరు గమనించినట్లయితే, ఈక్విటీ ఎక్స్పోజర్ కనీసం 80% ఉండాలి అని సెబీ పేర్కొన్నట్లు మీరు గమనించారు. ఏదేమైనా, ఫండ్ ఏ రకమైన మార్కెట్ క్యాప్ పెట్టుబడి పెట్టాలి అనే దానిపై మౌనంగా ఉంది. అందువల్ల, ఫండ్ మేనేజర్ తన ఎంపిక ప్రకారం పెద్ద క్యాప్, మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఎంచుకోవడానికి ఇది స్వేచ్ఛను ఇస్తుంది. ఇది భారీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. మొదట, మీరు స్మాల్ క్యాప్ యొక్క అనవసరమైన రిస్క్ తీసుకునే స్థితిలో లేకపోతే, మీ ఫండ్ మేనేజర్ స్మాల్ క్యాప్‌లో అవకాశాన్ని కనుగొన్నందున మీరు దీన్ని తీసుకోవలసి వస్తుంది. ఇది మీ స్థాయిలో ఒక రకమైన BLIND రిస్క్ తీసుకునే సామర్ధ్యం. ఈ ఫండ్ మేనేజర్ల కాల్స్ ఎన్నిసార్లు సరైనవో దేవునికి మాత్రమే తెలుసు.

 ఉదాహరణకు టాప్ 5 ELSS మ్యూటల్ ఫండ్స్ (AUM ఆధారంగా) యొక్క హోల్డింగ్స్ తీసుకోండి. 

  • Axis Long Term Equity Fund:-73% in Large, 22% in Mid, and 3% in Small Cap.
  • Birla Sunlife Tax Relief Fund:-46% in Large, 46% in Mid, and 8% in Small Cap.
  • Nippon India Tax Saver Fund:-72% in Large, 16% in Mid, and 12% in Small Cap.
  • SBI Long Term Equity Fund:-70% in Large, 20% in Mid, and 10% in Small Cap.
  • HDFC Tax Saver:-84% in Large 12% in Mid and 3% in Small Cap.

నేను మీకు చెప్పినట్లుగా వారు మీ కోరిక ప్రకారం కాకుండా వారు కోరుకున్నట్లుగా వారి హోల్డింగ్లను మార్చవచ్చు. అందువల్ల, తెలియకుండానే మీరు మిడ్ లేదా స్మాల్ క్యాప్‌లో ఉన్న స్టాక్‌లలో అనవసరమైన రిస్క్ తీసుకోవలసి వస్తుంది. 

పై వాస్తవాలు ఈక్విటీ భాగం గురించి. 

ELSS యొక్క నిర్వచనం వారు 80% ఈక్విటీని కలిగి ఉండాలని స్పష్టంగా ఉన్నందున, మిగిలిన 20% కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు. ఏదేమైనా, చాలా సందర్భాలలో, withdrawal  నిర్వహించడానికి ఫండ్ నిర్వాహకులు ఈ 20% నగదు లేదా మనీ మార్కెట్ సాధనాలలో కలిగి ఉంటారు. కానీ వారు అధిక liquid  ఆస్తులను కలిగి ఉండవలసిన అవసరం లేదు. ‘

Equity is for Long Term

# ఈక్విటీ దీర్ఘకాలిక కోసం ప్రభుత్వం నియమాలను ఎలా రూపొందిస్తుందో తెలుసుకోవడం వింతగా ఉంది. Sec.80C కింద పన్ను ప్రయోజనాల కోసం అందుబాటులో ఉన్న రుణ సాధనాలు కనీసం 5 సంవత్సరాల లాక్-ఇన్ తో లభిస్తాయి. 

ఏదేమైనా, ఈక్విటీ ఉత్పత్తి అయిన ELSS దీర్ఘకాలికంగా 3 సంవత్సరాల లాక్-ఇన్తో అందుబాటులో ఉండాలి. కానీ మీరు కూడా ఈ BLIND అశాస్త్రీయ ప్రభుత్వ నియమాన్ని పాటించి, మీ పెట్టుబడిని పణంగా పెట్టాలని కాదు. మీ దీర్ఘకాలిక లక్ష్యం కోసం మాత్రమే ఈక్విటీని ఉపయోగించండి మరియు అది కూడా debt  మరియు ఈక్విటీల మధ్య సరైన ఆస్తి కేటాయింపుతో కానీ పూర్తిగా ఈక్విటీలోకి కాదు. 

Filling Rs.1,50,000 under Sec.80C is EASY

# Sec.80C కింద రూ .1,50,000 నింపడం సులభం ఈ Sec.80C పరిమితిని పూరించేటప్పుడు చాలామంది ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో నాకు తెలియదు. 

మీకు ఇపిఎఫ్, విపిఎఫ్, పిపిఎఫ్, ఎస్‌ఎస్‌వై, లైఫ్ ఇన్సూరెన్స్ (టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్) లేదా గృహ రుణ ప్రిన్సిపాల్ వంటి అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ లక్షణాలను ఉపయోగించి, మీరు Sec.80C సులభంగా పూరించవచ్చు.

కానీ మనం సహజంగా debt ఉత్పత్తుల కంటే రాబడిని ఎక్కువగా ప్రేమిస్తాము. అందువల్ల, మనం Sec.80C క్రింద లభించే ఇతర ఎంపికల కంటే ELSS కు నిధులను ఎక్కువగా ఉపయోగిస్తాము.

Adopt the GOAL based investing

మీరు లక్ష్య-ఆధారిత పెట్టుబడిని అవలంబిస్తే, మీరు మీ పదవీ విరమణ లక్ష్యం కోసం (రుణ భాగంలో ప్రధాన భాగం) EPF మరియు VPF ని ఉపయోగించవచ్చు. అదే విధంగా మీరు 15 సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉన్న మీ లక్ష్యాల యొక్క రుణ భాగంగా పిపిఎఫ్‌ను మరియు మీ కుమార్తె యొక్క విద్యా మరియు వివాహ లక్ష్యం కోసం ఎస్‌ఎస్‌వైని ఉపయోగించవచ్చు. 

కానీ ఈ రుణ ఉత్పత్తులు కొన్ని లాక్-ఇన్లతో వస్తాయని గుర్తుంచుకోండి. అందువల్ల, మీ 100% పెట్టుబడి పెట్టడం కంటే, వాటిని మీ రుణ పోర్ట్‌ఫోలియోలో ప్రధాన భాగంగా (75% నుండి 80% వరకు) ఉపయోగించడం మరియు లిక్విడ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు అలాంటి లక్ష్య ఆధారిత పెట్టుబడి చేస్తే, అప్పుడు Sec.80C గ్యాప్ నింపడం చాలా సులభం.

Don’t be in a trap of advisers or AMCs who preach ELSS funds have an edge due to lock-in

ELSS ఫండ్లలో లిక్విడిటీ రిస్క్ లేనందున, చాలా మంది మధ్యవర్తులు మరియు AMC లు లాక్-ఇన్ యొక్క లక్షణాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారు, ఫండ్ మేనేజర్లు నిధులను మెరుగైన మార్గంలో నిర్వహించగలరు. అందువల్ల, ఉన్నతమైన రాబడిని పొందే సంభావ్యత ఎక్కువగా ఉంటుంది . అయితే, ఇది పూర్తి అపోహ. లాక్ ఇన్ గ్రేట్ పోర్ట్‌ఫోలియోను సృష్టించదు మరియు ఇది ప్రమాదాన్ని పూర్తిగా తొలగించదు.

 ఇది ఫండ్ మేనేజర్ల రిస్క్ మేనేజింగ్ పని. కేవలం 3 సంవత్సరాల లాక్ ఫండ్ సొంతంగా మెరుగ్గా పనిచేయడానికి యాడ్ ఆన్ కాదు.

ELSS Funds are not only LOCK IN for you but for your NOMINEE too!

ELSS పెట్టుబడిదారులకు, 3 సంవత్సరాల లాక్-ఇన్ ఉందని మనందరికీ తెలుసు.

 అయినప్పటికీ, పెట్టుబడిదారులు చనిపోతారు, అప్పుడు యూనిట్లు పూర్తయ్యే వరకు (పెట్టుబడి తేదీ నుండి) నామినీ డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతించబడదు. 

అందువల్ల, పెట్టుబడిదారుల కోసం, 3 సంవత్సరాల లాక్-ఇన్ ఉంది మరియు అతను మరణిస్తే, నామినీలకు ఇది ఒక సంవత్సరం లాక్-ఇన్. 

చాలా మంది పెట్టుబడిదారులకు తెలియదని నా అభిప్రాయం. 

Conclusion: -ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే, పన్ను ఆదా ప్రయోజనాల కోసం మ్యూచువల్ ఫండ్లకు దూరంగా ఉండాలని నేను గట్టిగా సూచిస్తున్నాను. సలహాదారులు లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీల ఉచ్చులో పడకుండా మీ లక్ష్యాలను నిర్వహించడం మరియు నెరవేర్చడం సులభం అయిన ఇతర ఎంపికలను ఉపయోగించండి.

Mutual Funds

ఆర్ధిక అక్షరాస్యత సాదించే సమయంలో ఎదుర్కొనే చాలా  బేసిక్ ప్రశ్న ఇది. చాలా మంది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాని వారికి కూడా చాలా మందికి అతి బేసిక్ ప్రశ్న ఈక్విటీ అంటే ఏమిటి ? డేట్ లేదా ఋణ పత్రం అంటే ఏమిటో తెలియదు.ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈక్వీటీ మరియు డేట్ అంటే ఏమిటి? వాటి మధ్య గల తేడా ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.ఈక్వీటీ అనగా షేర్లు లేదా వాటా అని అర్ధం అంటే మీరు ఒక కంపెనీలో ఈక్వీటీ తీసుకుంటున్నారు అంటే మీ ఈక్వీటీ విలువకి అనుగుణంగా మీరు ఆ కంపెనీలో యాజమాన్యుపు హక్కును పొందుతారు. మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు అనుకోండి. దానిని వంద సమానభాగాలు లేదా ముక్కలుగా  చేసి మీ వద్ద 51% భాగాలు లేదా ముక్కలు ఉంచుకొని మిగితా భాగాలు లేదా ముక్కలు ఇతరులకు ఇచ్చేసారు అనుకోండి. ఈ
ముక్కలు లేదా భాగాలనే ఈక్వీటీ , షేర్లు లేదా వాటాలు అంటారు.ఈ విధంగా వాటాలు తీసుకున్న వారందరూ మీ కంపెనీలో మీతో పాటు వారి వాటా విలువకి అనుగుణంగా యాజమాన్యుపు హక్కును పొందుతారు.మీరు ఈక్వీటీ లేదా షేర్ గురుంచి మరింత  వివరంగా తెలుసుకోవాడానికి  షేర్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ? అని నేను ఇది వరకు వ్రాసిన ఆర్టికల్ క్రింది లింక్ ద్వారా చదవండి.పూర్తీగా అర్ధం అవుతుంది.


ఇప్పుడు డేట్ అంటే ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. డేట్ అనగా ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ బ్యాంక్స్ , ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూట్స్  లేదా పబ్లిక్ నుండి అప్పు తీసుకోవడం ,ఈ విధంగా తీసుకున్న అప్పుకి   డేట్ సర్టిఫికేట్ లేదా ఋణ పత్రం ఇస్తాయి. మీరు  కంపెనీకి ఇచ్చే అప్పులనే డేట్ పేపర్స్ అంటారు. మీరు సాదారణంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాటా తీసుకొంటే మీరు కంపెనీలో భాగస్వాములు అవుతారు. ఇది మీరు ఈక్వీటీలు కనుగోలు చేయడం ద్వారా సాధ్యం అవుతుంది.అదే మీరు డేట్ పేపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కేవలం కంపెనీ కి అప్పు ఇచ్చినట్టు. మీరు ఇచ్చిన అప్పుకి కంపెనీ నిర్ణీత రేటు ప్రకారం వడ్డీ ఇస్తుంది.ఎందుకంటె కంపెనీ తన అవసరాలకు అనుగుణంగా మీ వద్ద డేట్ పేపర్ రూపంలో అప్పు తీసుకున్నది కావున.కొన్ని సమయాలలో ప్రభుత్వాలు కూడా ప్రజల వద్ద నుండి అప్పు సేకరిస్తుంటాయి.వాటినే మనం సాధారణంగా బాండ్స్ అని పిలుస్తుంటాం..ఈ డేట్ పేపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు బ్యాంక్స్ అందించే వడ్డీ కంటే అధిక వడ్డీ పొందవచ్చు.మరియు పూర్తీ సురక్షితం.

Mutual Funds

“సిప్ “అనే పదం ఇటీవల కాలం లో తరచుగా వింటున్నాం.చాలా మంది “సిప్ “అన గానే అదేదో ఒక స్కీం అని భావిస్తుంటారు .కానీ సిప్ అంటే మదుపు చేసే పద్ధతి.  సిష్టమేటిక్  ఇన్వెస్ట్మెంట్  ప్రోసీజర్  దీన్నే తెలుగులో క్రమానుగత పెట్టుబడి విధానం అంటారు. దీర్ఘ కాలిక వ్యూహం తో మదుపు చేసే ఇన్వెస్టర్ లకు సిప్ చాలా అనువైనది.రికరింగ్ డిపాజిట్ తరహాలోనే నెలకు నిర్ణీత మొత్తాన్ని  మదుపు చేయడాన్ని సిప్ అంటారు .  బ్యాంకుల్లో ,పోస్ట్ ఆఫీసుల్లో మదుపు చేస్తే రికరింగ్ అంటాం. అదే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే సిప్ అంటాం .అంతకు మించి  పద్దతిలో తేడా లేదు. అయితే రికరింగ్ లో వడ్డీ గ్యారంటీ వుంటుంది. సిప్ లో ఆ గ్యారంటీ లేదు. ఇన్వెస్టర్లు  ఆ విషయాన్నీ గమనించాలి.మ్యూచువల్ ఫండ్స్  సమీకరించిన మొత్తాలను  షేర్ల లో మదుపు చేస్తాయి కాబట్టి కొంత మేరకు నష్ట భయం వుంటుంది.  అందుకే రాబడికి ఫండ్స్ ఎలాంటి హామీలు ఇవ్వవు. అలాంటపుడు సిప్ చేయడమెందుకు అనే సందేహం కూడా రావచ్చు.

షేర్ మార్కెట్లో నేరుగా మదుపు చేయలేని ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ లో   మదుపు చేస్తుంటారు , ఫండ్స్ ను మార్కెట్ లో అనుభవం గల నిపుణులు  నిర్వహిస్తారు కాబటి నష్టం తక్కువ  ఉంటుందనే నమ్మకం తోనే ఫండ్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఈ ఫండ్స్ లో కూడా మంచి వాటిని ఎంచుకొని మదుపు చేస్తే లాభాలు ఆర్జించే అవకాశాలు పుష్కలం గా వున్నాయి.అయితే చిన్న ఇన్వెస్టర్లు పెద్ద మొత్తాల్లో మదుపు చేయ లేరు కాబటి నెల వారీ గా మదుపు చేసేందుకు సిప్
విధానం అమలు లో కొచ్చింది. దీర్ఘ కాలం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే లాభాలకు ఛాన్స్ ఉంది. అయితే పధకాల ఎంపిక పైనే లాభాలు ఆధార పడివుంటాయి.ఒకే సారి పెద్ద మొత్తం లొ మార్కెట్  పెట్ట కుండా కొద్ది పాటి మొత్తాల్లో క్రమం తప్ప కుండా మదుపు చేయాలి .ఇన్వెస్టర్ల వీలును బట్టి రూ. 500 ,1000 ,2000మేరకు నెల నెలా మదుపు చేయవచ్చు.ఈ విధానం లొ ముందుగా ఖచ్చితం గా ఏమేరకు మదుపు చేయ గలరో ఇన్వెస్టర్లు నిర్ణయించుకుంటే మంచిది.
ఎంత కాలం మదుపు చేస్తారనేది కూడా ముందుగా నిర్ణయించు కోవాలి .కనీసం మూడు నుంచి అయిదేళ్ళు వ్యవధి వరకు మదుపు చేస్తే లాభాలకు అవకాశం వుంటుంది .కాగా సిప్ పద్ధతి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లొ మదుపు చేయాలనుకునే ఇన్వెస్టర్లు  యే మ్యూచువల్ ఫండ్ సంస్థ కార్యాలయానికి వెళ్ళిన మిగతా విషయాలు వాళ్ళే చూసుకుంటారు. అయితే ముందుగా నిపుణుల  సలహా తీసుకుంటే మంచిది .