Uncategorized

రాము, రాజు కలిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. అందులో పదేళ్ళ అనుభవంతో సాలీనా 20–24% లాభాలు సంపాదిస్తున్నారు. ఆ విషయం తెలిసిన స్నేహితులు, బంధువులు తమ తరఫున పెట్టుబడి పెట్టమని వీరికి డబ్బిచ్చారు.

ఎక్కువ మూలధనం రావటంతో పెట్టుబడి ప్రణాళికను మరింత పటిష్టంగా తయారు చేసుకునే పనిలో పడ్డారు రాము, రాజు. ఒక హెడ్జ్ ఫండ్ మొదలుపెట్టారు.

రానున్న మూడేళ్ళలో ఇనుము, సిమెంట్, నిర్మాణ రంగాలలో నాణ్యమైన షేర్లు రాణించవచ్చని వారి విశ్లేషణలో తెలిసింది. అలా Tata Steel, JSW Steel, Ultratech Cement, Ramco Cement, L&T, Dilip Buildcon, KNR Constructions షేర్లు పెద్ద మొత్తంలో కొన్నారు. ఇంతవరకూ హెడ్జ్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కార్యాచరణ ఒకేలా ఉంటుంది.

అయితే ఇక్కడో చిక్కు. పెట్టుబడి మూలధనం ఎక్కువయ్యే కొద్దీ ఒక స్టాక్ యొక్క స్వకీయ రిస్క్ కంటే పోర్ట్‌ఫోలియో సమిష్టి రిస్క్ ఎక్కువవుతుంది. ఆ రిస్క్‌ను వీలైనంత తగ్గించే విధానంలోనే మ్యూచువల్ ఫండ్‌కు, హెడ్జ్ ఫండ్‌కు ముఖ్యమైన తేడా.

ఒకవేళ 2008, కరోనా వంటి సంక్షోభం వచ్చి మార్కెట్లు కుదేలైతే మదుపర్లు భయపడి రాము, రాజులను తమ డబ్బు వెనక్కు అడిగే అవకాశమెక్కువ. అప్పుడు ఎక్కువ నష్టాలకు షేర్లను అమ్మివేయవలసి వస్తుంది.

అందుకే కాస్త ముందు చూపుతో రాము, రాజు వారు కొన్న షేర్ల ఫ్యూచర్లు షార్ట్ చెయ్యటం, ఫ్యూచర్లు లేని షేర్లకు ప్రతిరక్షగా నిఫ్టీ కాల్ ఆప్షన్లు షార్ట్ చెయ్యటం చేశారు. ఇదంతా షేర్ మార్కెట్లు పతనమయ్యే పరిస్థితికి పరిగణిత రక్షణను కొనటం అనుకోవచ్చు. ఇకపై మార్కెట్లు పతనమైనా ఆ ఫ్యూచర్లు, కాల్ ఆప్షన్లలో వచ్చే లాభం షేర్లలో వచ్చే నష్టాన్ని భర్తీ చెయ్యగలవు.

రాము, రాజు నడుపుతున్నది ఒక సరళమైన హెడ్జ్ ఫండ్.

సాధారణంగా పలు దేశాల రియల్ ఎస్టేట్, ప్రభుత్వ బాండ్లు, బంగారం, చమురు, పసుపు, కాఫీ, మార్కెట్లో లిస్ట్ అవ్వని సంస్థల్లో వాటాలు వంటి పలు సెక్యూరిటీలతో లాభాలను పెంచుకునే ప్రణాళికలు రచించుకుంటాయి హెడ్జ్ ఫండ్లు. ఇదంతా కూడా అభిజ్ఞ ఊహ మాత్రమే.

అయితే మ్యూచువల్ ఫండ్లతో పోల్చితే హెడ్జ్ ఫండ్లలో కొన్ని ముఖ్య వ్యత్యాసాలు:

  • పెట్టుబడి అవకాశం కొందరికే.
  • కనీస పెట్టుబడి మొత్తం చాలా ఎక్కువ (అమెరికాలో కొన్ని హెడ్జ్ ఫండ్లలో కనీసం వంద మిలియన్ డాలర్లు).
  • నిర్వాహణ రుసుము ఎక్కువ. ఉదాహరణకు ఏటా మూలధనంలో 2% + 20 శాతాన్ని మించిన లాభాల్లో 15%.
  • ప్రభుత్వ ఆర్థిక విధివిధానాల పరిధిలోకి రావు.
  • పెట్టుబడుల వివరాలు బహు గోప్యం.
  • నాణ్యమైన హెడ్జ్ ఫండ్లు నిలకడగా ఏటా 50 శాతాన్ని మించిన లాభాలు సంపాదించిన దాఖాలాలున్నాయి.

నిజానికి కొన్ని హెడ్జ్ ఫండ్లు కొన్నేళ్ళకు వారి ప్రణాళికతో వచ్చిన లాభాలతో మొదట పెట్టుబడి పెట్టిన వారికి లాభాలతో సహా వారి మూలధనం తిరిగిచ్చేసి ఆపై సొంతంగా మాత్రమే ఫండ్ నడుపుతారు.

ఉదాహరణకు ప్రపంచంలోని అత్యుత్తమ హెడ్జ్ ఫండ్ సంస్థ అయిన  రినైసాన్స్ టెక్నాలజీస్ తమ మెడాలియన్ ఫండ్‌ను కేవలం తమ ఉద్యోగులకు మాత్రమే నడుపుతున్నారు. ఈ మెడాలియన్ ఫండ్ గత ముప్పై ఏళ్ళుగా ఏటా 66% లాభాలార్జిస్తోంది. ఈ సంస్థకు చెందిన విషయాలన్నీ ఎంతో గోప్యం. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఇంటర్వ్యూ ప్రక్రియ వీరిది అని ఫైనాన్స్ వర్గాల్లో నానుడి.

మన దేశంలో హెడ్జ్ ఫండ్ల ప్రణాళికల గురించి మరింత వివరణకు (ఆర్థిక అంశాలపై బాగా అవగాహన ఉన్నవారికి మాత్రమే!)

మన దేశంలో హెడ్జ్ ఫండ్లకు SEBI 2012లో అనుమతిచ్చింది. వాటిని ఇక్కడ Alternate Investment Funds(AIF) అంటారు. మన దేశంలో ఇప్పటి వరకూ రెజిస్టర్ అయిన హెడ్జ్ ఫండ్ల వివరాలు SEBI వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

టూకీగా హెడ్జ్ ఫండ్ అంటే ధనవంతుల సంపదను మరింత వేగంగా పెంచే ఒక ప్రీమియం ఉత్పత్తి అనుకోవచ్చు.

గ్లోబల్ మాక్రో ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని ఉపయోగించి హెడ్జ్ ఫండ్స్..,

1.రిస్క్-సర్దుబాటు రాబడిని సంపాదించడానికి గ్లోబల్ స్థూల ఆర్థిక మేనేజ్ మెంట్

2. షేర్డ్ లేదా కరెన్సీ మార్కెట్లలో గణనీయమైన పెట్టుబడులు తీసుకుంటారు

3. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కదలికల నుండి లాభం పొందే పెట్టుబడికి అవకాశాలను గుర్తించడానికి గ్లోబల్ మాక్రో ఫండ్ నిర్వాహకులు ప్రపంచ మార్కెట్ సంఘటనలు మరియు పోకడల ఆధారంగా స్థూల ఆర్థిక విధానాల ఉపయోగిస్తారు

4. మార్కెట్లలో విభిన్న పెట్టుబడులలో పెద్ద స్థానాలను తీసుకోవటానికి పరపతి ఉపయోగించగల సామర్థ్యం ఆకర్షణీయమైన, రిస్క్-సర్దుబాటు చేసిన రాబడిని సంపాదించడానికి వ్యూహాలు చేస్తార

Uncategorized

మీరు అమెజాన్‌తో కలిపి పని చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అమెజాన్ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. దీని ద్వారా ప్రతి నెలా అదనపు డబ్బులు పొందొచ్చు.

కరోనా టైమ్‌లో ఈ-కామర్స్ బిజినెస్ గణనీయంగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈకామర్స్ కంపెనీలు కూడా వాటి ఫ్రాంచైజీలను విస్తరించుకుంటూ వస్తున్నాయి. మీరు కూడా ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ప్రారంభించొచ్చు. ప్రతి నెలా అదిరిపోయే రాబడి పొందొచ్చు.

అమెజాన్ డెలివరీ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. దీని ద్వారా ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. అయితే ఎక్కువ స్థలం కావాలి. మీకు కిరాణ షాపు ఉండి, అందులో ఖాళీ ఉంటే.. మీరు సులభంగానే అమెజాన్ ఫ్రాంచైజీ ద్వారా సంపాదన పొందొచ్చు.

అమెజాన్ ఐ హ్యావ్ స్పేస్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మీరు మీ లోకల్ ఏరియాలో అమెజాన్ డెలివరీ సర్వీసులు అందించడ ద్వారా డబ్బులు పొందొచ్చు. ప్రతి డెలివరీకి మీకు కమిషన్ వస్తుంది. అంటే అదనపు ఆదాయం పొందొచ్చు.

మీరు 2 నుంచి 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో డెలివరీ చేయొచ్చు. 2 నుంచి 3 గంటల్లో ఈ పని పూర్తి చేసుకోవచ్చు. మీ లొకేషన్ ఆధారంగా అమెజాన్ మీకు డెలివరీ ప్రొడక్టులు అందిస్తుంది. మీకు స్మార్ట్‌ఫోన్, బైక్ ఉండాలి.

ఈ ప్రొడక్టులను డెలివరీ చేస్తే ఒక్కో ప్రొడక్టుకు రూ.15 నుంచి 20 వరకు కమిషన్ పొందొచ్చు. లేదంటే అమెజాన్ డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్స్‌గా కూడా చేరొచ్చు. దీనికి రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

Mutual Funds Uncategorized

మ్యూచువల్ ఫండ్లలో (ఆ మాటకొస్తే స్టాక్ మార్కెట్లో) పెట్టుబడి అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడితో సమానం. ఊరికే డబ్బు పోగొట్టుకోవాలని అయితే ఎవరూ ఎందులోనూ పెట్టుబడి పెట్టరు (సాధారణంగా).

నాకు తెలిసిన ఒకాయన పాల వ్యాపారం గురించి బాగా వివరాలు సేకరించి అందులోకి దిగారు కానీ మూడేళ్ళలో నష్టాలకు మూసివేసారు. పాల వ్యాపారమే అప్పటికి మూడేళ్ళుగా నష్టాల్లో నడుపుతున్న ఇంకొకాయనపై నమ్మకంతో నా స్నేహితుడు 5 లక్షలు అందులో పెట్టుబడి పెట్టాడు. మరో మూడేళ్ళలకు లాభాలు మొదలై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం బాగా విస్తరించిన బ్రాండ్ అయిందది. ఆ 5 లక్షల వాటా ఇప్పుడు దాదాపు కోటి రుపాయలు విలువ చేస్తుంది. మరి పాలవ్యాపారం అది చేసేవారందర్నీ ధనవంతులను చేస్తుందా?

డ్యూ డిలిజెన్స్ (వ్యాపారం గురించి వివరాలు, విశేషాలు అన్నీ తెలుసుకుని, లాభం వచ్చే అవకాశం మెండుగా ఉందా అని తెలుసుకోవటం) – వ్యాపారం మొదలుపెట్టాలనుకునే ప్రతిఒక్కరు చేసేదే. అయినప్పటికీ అందరూ వ్యాపారంలో లాభాలార్జించలేరు. దీనికి కారణం అదృష్టం కాదు – నిరంతర శ్రమ, మార్పుకు సంకోచించని తత్వం. వ్యాపారం మొదలెట్టేశాం కదా అని గుఱ్ఱాల కళ్ళకు కట్టే బ్లింకర్స్ వంటివి పెట్టేసుకుని మూసధోరణిలో వెళ్తే కష్టం.

ఏ పెట్టుబడి అయినా అది అమలు చేసే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

మనం చేరాల్సిన గమ్యం ధనవంతులం అవడం అయితే మనల్ని అక్కడికి తీసుకువెళ్ళే వాహనాలలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. ఆ వాహనం నడిపే విధానాన్ని బట్టి మనం గమ్యం చేరుకుంటామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ మిమ్మల్ని ధనవంతులుగా చేయగలవా?

ఖచ్చితంగా చెయ్యగలవు. ఒక క్రమబద్ధమైన పద్ధతిలో పెట్టుబడి పెడితే మ్యూచువల్ ఫండ్ల ద్వారా ధనం సంపాదించడం సాధ్యమే.

అయితే పెట్టుబడి పెట్టేశాం, ఇక ధనవంతులైపోవటమే తరువాయి అని బిందాస్‌గా గుడ్లను చూసి కోడిపిల్లలను లెక్కపెట్టేసుకునే ధోరణి ఉంటే సత్ఫలితం దాదాపు అసంభవం.

  1. ఎంత కాలానికి, ఎందుకు పెట్టుబడి పెడుతున్నదీ స్పష్టంగా నిర్ణయించుకోవాలి.
  2. తదనుగుణంగా నాణ్యమైన మ్యూచువల్ ఫండ్లు ఎంచుకోవాలి.
  3. పెట్టుబడి దీర్ఘకాలానికైతే డైరెక్ట్ ఫండ్లనే ఎంచుకోవాలి.
  4. దీర్ఘకాలానికైతే (అంటే ఆరేళ్ళకు మించి) ఏడాదికోసారి, స్వల్పకాలానికైతే (అంటే రెండు-మూడేళ్ళకు) ఆరు నెలలకోసారి ఫండ్ పనితీరును సమీక్షించాలి.
  5. పనితీరు సంతృప్తికరంగా లేకపోతే నిర్మొహమాటంగా డబ్బును నాణ్యమైన ఫుండ్‌కు తరలించాలి.
  6. మార్కెట్లో వచ్చే కుదుపులకు (ఉదాహరణకు 2008, కోవిడ్) భయాందోళనలకు లోనవ్వకుండా, అటువంటి కుదుపులను అవకాశాలుగా ఉపయోగించుకోగల వెరవని ధైర్యముండాలి.

పైవన్నీ పాటించే ఎవరినైనా మ్యూచువల్ ఫండ్లు ధనవంతులను చేస్తాయి.

గమనిక: మ్యూచువల్ ఫండ్లు అంటే ఈక్విటీ ఫండ్లు అన్న అర్థంతోనే ఈ సమాధానం రాయటం జరిగింది. ఎందుకంటే నాణ్యమైన ఈక్విటీ ఫండ్లు మాత్రమే మదుపర్లను ధనవంతులను చెయ్యగలవు, వాటి ఉద్దేశ్యమూ అదే. డెట్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు ముఖ్యంగా ఎఫ్‌డీలను మించిన రాబడి పొందేందుకే.

Uncategorized

నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించడం చాలా పెద్ద కళ అని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ లాంటిది. చాలా రీసెర్చ్ చేసిన తరువాత కానీ స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా డబ్బులు పెట్టకూడదు.

రహస్యాలు కాదు కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక ప్రాసెస్/ పద్దతి ఉంటుంది. అది కొన్నిసార్లు ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు.

  • తక్కువ పెట్టుబడి తో, తక్కువ కాలం లో ఎక్కువ సంపాదిద్దామని అనుకోకండి. అలా అనుకుంటే అదే ఫెయిల్యూర్ కి మొదటి మెట్టు. స్టాక్ మార్కెట్ లో లాభాలు దీర్ఘకాలంలో (లాంగ్ టర్మ్ లో) సగటున 15–20% రావచ్చు.
  • స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ ఏవీ గ్యారంటీ కాదు. ఒక సంవత్సరం 40% లాభం రావచ్చు, ఒకసారి 20% లాభమే రావచ్చు ఒక్కోసారి 20% నష్టం రావచ్చు. అన్నింటికి సిధ్ధపడి 6–8 సంవత్సరాలు పెట్టుబడి పెట్టేటట్టయితేనే స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టాలి.
  • ఆ పెట్టుబడి పెట్టే డబ్బు సగానికి నష్టం వచ్చినా (అంటే లక్ష పెడితే 50 వేలు పోయినా) మీరు నిశ్చింతగా ఉండగలరనుకునేంత డబ్బు మాత్రమే పెట్టండి. అంత నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తరువాత పాయింట్స్ లో చెబుతాను.
  • ఎక్కువ రిటర్న్స్ వచ్చే సలహాలు/ టిప్స్ ఇస్తామనే వారి మాటలు నమ్మకండి. మీరు వారికి కట్టే ఫీజు కంటే కనీసం 10 రెట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో మీకు మంచి లాభం, లేదా ఖరీదైన అనుభవం వస్తుంది.
  • సెబీ ద్వారా సర్టిఫై అయిన మంచి స్టాక్ అడ్వైసర్ ద్వారానే ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ చిక్కు ఏంటంటే అందరు అడ్వైసర్లూ సెబీ రిజిస్టర్డ్ అయినవాళ్లే. కానీ అందులో ఎవరు మంచి స్కిల్ ఉన్న అడ్వైసర్ అనేది తెలియడం కష్టం.
  • మీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ క్వాలిటీ ఉన్న కంపెనీలలో మాత్రమే చేయాలి. ఈ క్వాలిటీ నిరూపించడం,కనిపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా పెద్ద ఆన్సర్/ వ్యాసం రాసుకోవచ్చు.
  • ప్రారంభం లో పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఉదా: ఆసియన్ పెయింట్స్, HDFC బ్యాంక్, హిందూస్తాన్ యూనీలీవర్ లాంటివి. వీటిలో రిస్క్ తక్కువ. సాధారణంగా మీరు ఎంత చిన్న కంపెనీలో పెడితే అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగని కంపెనీ పెద్దగా ఉంటే పెట్టుబడి/మీ డబ్బు సేఫ్ అని కాదు. ఉదా: కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్ కంపెనీలు ఇన్వెస్టర్లని ఆకాశపుటంచులకి తీసుకెళ్లి వదిలేశాయి. చూశారా ఎంత కష్టంగా ఉందో. అందుకే లోతు తెలియకుండా, రీసెర్చ్ లేకుండా ఇన్వెస్ట్ చేయవద్దు.
  • మీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ని మంచి క్వాలిటీ ఉన్న వివిధ పెద్ద, చిన్న కంపెనీల్లో మరియు వివిధ రంగాల్లో (బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు, ఆటోమొబైల్, సాఫ్ట్వేర్, సిమెంట్, కన్స్ట్రక్షన్, టెక్నాలజీ …..) పెట్టుబడి పెట్టడం మంచిది. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు.
  • అలాగని మీ ఇన్వెస్ట్మెంట్ ని ఓ 108 కంపెనీల్లో పెట్టద్దు. మీకు మార్కెట్ ని దాటి రిటర్న్స్ రావు. ఇవ్వన్నీ రూల్స్ పాటిస్తూ స్టాక్ మార్కెట్ పండితులు 12- 15 కంపెనీల్లో పెట్టుబడి పెట్టమంటారు. అప్పుడు మీ రీసెర్చ్, ఎంట్రీ, ఎగ్జిట్ కరెక్ట్ గా ఉండి ,మీరు ఎక్కువకాలం మార్కెట్ లో ఉంటే మాంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ. స్టాక్ మార్కెట్లో దాదాపు 6000కి పైగా కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. అందులో మీరు 12–15 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
  • మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు సంబంధించిన వార్తలు, కంపెనీ స్టేట్మెంట్స్, లాభనష్టాలు అన్నీ ఫాలో అవుతూ ఉండాలి. 100 కంపెనీల్లో పెడితే అన్నింటినీ చదవలేం కదా. తప్పు చేసే అవకాశం ఉంది, అందుకే పైన పాయింట్ వచ్చింది.
  • మీరు పెట్టుబడి పెట్టిన స్టాక్స్ తో ఎప్పుడూ ప్రేమ పెంచుకోకూడదనేది స్టాక్ మార్కెట్ లో నానుడి. ఒకవేళ అనుకోకుండా కొంత నష్టం వచ్చి మీ రీసెర్చ్ సరి అయినది కాకపోతే వెంటనే ఆ స్టాక్ ని అమ్మి బయటకు వచ్చేయాలని సూచిస్తారు. ఈ విషయంపై బిహేవియరల్ ఫైనాన్స్ అని ఒక పెద్ద సబ్జెక్టు ఉంది.
  • మీరు కనుక స్టాక్ మార్కెట్ కి కొత్త అయితే ముందుగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టండి.

ఇన్ని విషయాలు నెగటివ్ గా చెప్పానా. నాకు స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇష్టం. నేను చాలా నష్టపోయా కానీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటున్నా. 5 ఏళ్ల రోలర్ కోస్టర్ రైడ్ మరి.

Uncategorized

స్టార్టప్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రముఖ కార్యక్రమము. దేశంలో శక్తివంతమైన ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల అభివృద్ధికి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దీని ఉద్ధేశం. ఇది స్థిరమైన ఆర్థిక వృద్ధిని మరియు భారీ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది. ప్రభుత్వం చొరవతో స్టార్టప్ల ఆవిష్కరణ మరియు డిజైన్లను పెంచడానికి ప్రయత్నిస్తుంది.

భారతదేశం స్టార్టప్ యాక్షన్ ప్లాన్ అవలోకనం

లక్ష్యాలను పూర్తిచేయడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ యొక్క అన్ని అంశాలను కలిగిన భారత యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ యాక్షన్ ప్లాన్ తో ప్రభుత్వపు స్టార్టప్ ఉద్యమ వ్యాప్తి వేగవంతం అవుతుందిని భావిస్తోంది.

  • డిజిటల్/సాంకేతిక రంగం నుండి వ్యవసాయం, తయారీ, సామాజిక రంగ, ఆరోగ్య, విద్య, మొదలైన రంగాలకు వస్తరిస్తుంది.; మరియు
  • ప్రస్తుతమున్న టైర్ 1 నగరాల నుంచి టైర్ 2, టైర్ 3 నగరాలు మరియు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరింస్తుంది.

యాక్షన్ ప్లాను క్రింది విధంగా విభజించబడింది:,

  • సరలీకరణ మరియు హ్యాండ్ హోల్డింగ్
  • నిధుల మద్దతు మరియు ఇన్సెంటివ్స్
  • ఇండస్ట్రీ అకాడెమియా భాగస్వామ్యం మరియు ఇంక్యుబెషను

ప్రణాళికలో ముఖ్యాంశాలు

సరలీకరణ మరియు హ్యాండ్ హోల్డింగ్,

  • స్వీయ సర్టిఫికేషన్ ఆధారంగా అంగీకారము – స్టార్టప్లకు 9 కార్మిక మరియు పర్యావరణ చట్టాలకు సంబంధించి స్వీయ అంగీకారాన్ని(స్టార్టప్ మొబైల్ అనువర్తనం ద్వారా) అనుమతి లభించును. కార్మిక చట్టాల సందర్భంలో, 3 సంవత్సరాల వ్యవధి వరకు ఏ పరీక్షలు నిర్వహించరు. స్టార్టప్ల ఉల్లంఘనలకు సంబంధించి నమ్మదగిన మరియు పరిశీలనా ఫిర్యాదు అంది కనీసం ఒక సీనియర్ లెవెల్ పర్యవేక్షణాధికారి ఆమోదించింన తర్వాత విచారణను చేపడతారు. పర్యావరణ చట్టాలకు సంబంధించి ఇవి ‘తెలుపు వర్గం’ కిందికి వస్తాయి (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) నిర్వచించిన విధంగా). అలాంటి సందర్భాలలో స్వీయ సర్టిఫై సమ్మతి ఉన్నందు వలన స్టార్టప్లకు తక్కువ నిఖీలు జరుగుతాయి.
  • స్టార్టప్ భారత్ హబ్ –మొత్తం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఒకే దగ్గర సంప్రదింపులు జరపటం మరియు నిధులు మరియు సమాచార మార్పిడి యాక్సెసును ఎనేబుల్ చెయ్యటం.
  • రోలింగ్ అవుట్ మొబైల్ ఆప్ మరియు పోర్టల్ – అన్ని వ్యాపార అవసరాలు మరియు వివిధ వాటాదారుల మధ్య సమాచార మార్పిడి కోసం ప్రభుత్వం మరియు రెగ్యులేటరీ సంస్థలతో కలవడానికి ఒకే వేదికను నిర్మించటం.
  • లీగల్ మద్దతు మరియు తక్కువ ఖర్చుతో ఫాస్ట్ ట్రాక్ పేటెంట్ పరిశీలన – ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ పేటెంట్లు, చిహ్నాలు లేదా నమూనాలకు సంబంధిచిన వాటి మొత్తం ఫీజును భరింస్తుంది. స్టార్టప్ చట్టబద్ధమైన ఫీజు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. అప్లికేషన్ దాఖలు చేయడానికి తగ్గింపును కల్పిస్తుంది: స్టార్టప్ పేటెంట్లపై ఇతర కంపెనీలుతో పోలిస్తే80% రిబేటు పొందితుంది. ఈ పథకం ఒక సంవత్సరం పాటు పైలెట్ ప్రాతిపదికన మొదట ప్రారంభించబడింది; అనుభవము ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.
  • స్టార్టప్ పబ్లిక్ ప్రోక్యూర్మెంట్ నిబంధనల సడలింపు – స్టార్టప్లను ప్రోత్సహించే క్రమంలో, ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు లేదా సాంకేతిక పరిమితులలో ఏ సడలింపు లేకుండా “అనుభవముతో/టర్నోవర్” యొక్క ప్రమాణం నుండి స్టార్టప్లకు (తయారీ రంగంలో) మినహాయింపును ఇచ్చింది. స్టార్టప్ కూడా కొన్ని అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు అమలులో అవసరమైన సామర్ధ్యం ప్రదర్శించేందుకు భారతదేశంలో వారి సొంత తయారీ సౌకర్యాలు తప్పని సరిగా కలిగి ఉండాలి.
  • స్టార్టప్ల కోసం వేగంగా నిష్క్రమణ – స్టార్టప్ ఇటీవలి దివాలా మరియు వ్యాపారాల స్వచ్ఛంద మూసివేత నిబంధనలు దివాలా బిల్ 2015, ప్రకారం, ఫాస్ట్ ట్రాక్ ఆధారంగా విరమించుకోవచ్చు. అప్లికేషన్ ఇచ్చిన 90 రోజుల వ్యవధిలో మూసివేయటానికి అనుమతిని ఇస్తారు. ఈ ప్రక్రియ పరిమిత బాధ్యత భావనతో పనిచేస్తుంది.

నిధుల మద్దతు మరియు ఇన్సెంటివ్స్

  • ₹ 10,000 కోట్ల కార్పస్ ఫండ్ ద్వారా నిధులు మద్దతు అందించడం – స్టార్టప్లకు మద్దతు అందించడానికి ప్రభుత్వం 2,500 కోట్ల ప్రారంభ కార్పస్ మరియు నాలుగు సంవత్సరాలకు 10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయనుంది (అంటే సంవత్సరానికి 2,500 కోట్లు). ఇది ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపంలో ఉంటుంది. ఇది స్టార్టప్లకు నేరుగా పెట్టుబడి పెట్టదు. కానీ సెబి తో నమోదు అయిన వెంచర్లకు ఇది నిధులను అందిస్తుంది.
  • స్టార్టప్లకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ –జాతీయ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ (NCGTC)/SIDBI ద్వారా క్రెడిట్ గ్యారంటీ మెకానిజం కోసం రాబోయే నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 500 కోట్లు బడ్జెట్లో ఉంచబడతాయి.
  • పెట్టుబడి లాభాల మీద పన్ను మినహాయింపు – ఈ లక్ష్యం తో, ప్రభుత్వం ద్వారా గుర్తింపు ఫండ్స్ ఆఫ్ ఫండ్ లో మూలధన లాభాలు పెట్టుబడి ఉంటే, సంవత్సరంలో మూలధన లాభాలు కలిగిన వ్యక్తులకు పన్నులు ఉండవు. అదనంగా, వ్యక్తులు కొత్తగా ఏర్పరిచిన తయారీ SMEs పెట్టుబడికి ఇప్పటికే మూలధన రాబడి పన్ను మినహాయింపును అన్ని స్టార్టప్లకు విస్తరించవచ్చు.
  • పన్ను 3 సంవత్సరాలు స్టార్టప్లకు మినహాయింపు – స్టార్టప్ లాభాలకు 3 సంవత్సరాల వరకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. మినహాయింపు స్టార్టప్ ద్వారా డివిడెండ్ పంపిణీ చేయకుండా ఉంటేనే అందుబాటులో ఉంటుంది.
  • సరసమైన మార్కెట్ విలువ కంటే ఎక్కువ పెట్టుబడులపై పన్ను మినహాయింపు – ఒక స్టార్టప్ (సంస్థ) వాటాలు, అదనపు పరిశీలనలో సరసమైన మార్కెట్ విలువకు (FMV) మించి వాటాలను జారీచేస్తే ఆదాయపు పన్ను చట్టం, 1961, కింది పన్ను విధించబడుతుంది. స్టార్టప్లో వెంచర్ కాపిటల్ నిధులను ఉపయోగిస్తే దీనీకి మినహాయింపు ఉంది. స్టార్టప్లు ఇంక్యుబేటర్లలో పెట్టుబడి చేసినప్పుటు దీనిని విస్తరించవచ్చు.

ఇండస్ట్రీ -అకాడెమియా భాగస్వామ్యం మరియు ఇంక్యుబేషన్

  • ఇన్నోవేషన్ ప్రదర్శనలను మరియు కొలాబరేషనుకు వేదికల కోసం స్టార్టప్ ఉత్సవాల నిర్వహణ –భారతదేశంలో స్టార్టప్ వాతావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రభుత్వం జాతీయ మరియు అంతర్జాతీయ స్టేజీలలో స్టార్టప్ ఉత్సవాలను పరిచయంచెసే ప్రతిపాదన ఉంది.
  • స్వయం ఉపాధి మరియు టాలెంట్ యుటిలైజేషన్లతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) కార్యక్రమం ప్రారంభం (SETU) –వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెక్టార్ సంబంధిచిన ఇంక్యుబేటర్లను మరియు 500 ‘టింకరింగ్ ల్యాబ్స్’ను స్థాపించింది. దీనిలో, స్టార్టప్ అదిక పెరుగుదల కోసం, ప్రాథమిక శిక్షణతోపాటు సీడ్ ఫండ్ ఉంటుంది. మూడు జాతీయ అవార్డులతో పాటు మూడు ఆవిష్కరణ అవార్డులు ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇస్తారు. అలాగే దేశంలో అతి తక్కువ ఖర్చు పరిష్కారాలను కనుగొన్నవారికి ఒక గ్రాండ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అవార్డును కూడా ఇస్తారు.
  • ఇంకుబేటర్ సెటప్ కోసం ప్రైవేట్ సెక్టార్ నిపుణత నియంత్రణ – ప్రభుత్వ మద్దతు/నిధులతో ఇంక్యుబేటర్ల నిర్వహణకు, ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడానికి ఒక విధానాన్ని మరియు ఫ్రేమ్ వర్కును తయారు చేస్తుంది.
  • నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లలో ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు-దేశంలో R & D మిరియు ఇంక్యుబేటర్ల ఎదుగుదల ప్రయత్నాలు పెంపొందించడానికి గాను ప్రభుత్వం జాతీయ ఇన్స్టిట్యూట్లలో (1,200 కంటే ఎక్కువ నూతన స్టార్టప్ల ప్రారంభాలకు సౌకర్యాలు అందించడానికి) 31 కేంద్రాలను ఆవిష్కరిస్తుంది.
  • ఐఐటీ మద్రాసు రిసెర్చ్ పార్క్ సెటప్పును పోలిన7 కొత్త పరిశోధనా పార్కుల ఏర్పాటు –ప్రభుత్వం 100 కోట్లతో 7 కొత్త పరిశోధనా పార్కు ఇన్స్టిట్యూట్లను ప్రారంభిస్తుంది. ఈ రీసెర్చ్ పార్కులకు ఐఐటీ మద్రాసు రిసెర్చ్ పార్కును మోడలులాగా నిర్ణయించారు.
  • బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్ల ప్రోత్సహించడం –5 కొత్త బయో క్లస్టర్లు, 50 కొత్త బయో ఇంక్యూబేటర్లు, 150 సాంకేతిక బదిలీ కార్యాలయాలు మరియు 20 బయో కనెక్ట్ కార్యాలయాలను భారతదేశం అంతటా పరిశోధన సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలో ఏర్పాటు చేయబడతాయి. BIRAC ఏస్ ఫండ్ జాతీయ మరియు గ్లోబల్ ఈక్విటీ ఫండ్స్ (భారత్ ఫండ్, ఇతర మధ్య భారతదేశం ఆశించిన ఫండ్) భాగస్వామ్యంతో యువ బయోటెక్ స్టార్టప్లకు ఆర్థిక సాయాన్ని అందింస్తుంది.
  • ఆవిష్కరణలపై దృష్టిసారించే విద్యార్థి కార్యక్రమాలు – ఐదు లక్షల పాఠశాలలో 10 లక్షల ఆవిష్కరణలను సేకరించాలని ఆవిష్కరణ కోర్ కార్యక్రమం చేస్తుంది. వాటిలో 100 ఉత్తమ ఆవిష్కరణలను ఎంపికచేసి రాష్ట్రపతి భవన్లో వార్షిక ఫెస్టివల్లో ప్రదర్శింప చేస్తుంది. గ్రాండ్ చాలెంజ్ కార్యక్రమం NIDHI (జాతీయ హార్నేస్సింగ్ ఆవిష్కరణలు మరియు అభివృద్ధి కార్యక్రమం) ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అభివృద్ధి కేంద్రాల (IEDCs) సహాయంతో ఏర్పాటు చేయబడుతుంది. ఇది 10 లక్షల రూపాయల అవార్డును 20 మంది విద్యార్థి ఆవిష్కరణలకు అందజేస్తుంది. ఉచ్చతర్ ఆవిష్కార్ యోజనను, ఉమ్మడి MHRD-DST పథకం ద్వారా ఏటా 250 కోట్ల రూపాయలు ఐఐటి విద్యార్థుల ” చాలా అధిక నాణ్యత” పరిశోధనను ప్రోత్సహించడానికి, ప్రారంభించారు.
  • వార్షిక ఇంకుబేటర్ గ్రాండ్ ఛాలెంజ్ –ప్రభుత్వం పది ఇంకుబేటర్లను గుర్తించి ఎంచుకుంటుంది. వాటి పని తీరును ముందే ఉన్న పనితీరు సూచికలతో (KPIs) మూల్యాంకనంచేసి అవి ప్రపంచ స్థాయి సామర్ధ్యం కలిగి ఉన్నాయని తెలిస్తే వాటికి రూ .10 కోట్ల సహాయం వాటి ముల సదుపాయాల అభవృద్ధికీ గాను ఇస్తుంది.

ఆధారం : స్టార్టప్ ఇండియా

Uncategorized

ఇప్పటికీ వాడుకలో ఉర్దూ పదాలే అధికం

నిజాం కాలం నుంచీ చలామణి

చాలా మందికి అర్థంకాని పరిస్థితి

రెవెన్యూ పదజాలం.. ఇప్పటికీ చాలామందికి అర్థంకాని గందరగోళం.. నిజాం కాలం నుంచి చలామణిలో ఉన్న ఈ పదాలపై ఓ సారి లుక్కేద్దాం.. రెవెన్యూ శాఖ పదాలు ఎక్కువగా ఉర్దూలోనే ఉన్నాయి. కాలక్రమేణా ఇంగ్లిష్, తెలుగు పదాలు కొన్ని వచ్చి చేరినా ఈ పరిభాష ఇప్పటికీ సామాన్యులకే కాదు.. ఆ శాఖలో కొందరు ఉద్యోగులకు సైతం తెలియదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ‘రెవెన్యూ శాఖ’ హాట్ టాపిక్లా మారిన నేపథ్యంలో అందులోని కొన్ని పదాలు..

వాటి అర్థాలు మీ కోసం..

గ్రామ కంఠం : గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అం టారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.

అసైన్డ్భూమి : భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.

ఆయకట్టు : ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.

బంజరు భూమి (బంచరామి) : గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

అగ్రహారం : పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.

దేవళ్ ఇనాం : దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.

అడంగల్ (పహాణీ) : గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ను అడంగల్ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

తరి : సాగు భూమి

ఖుష్కీ : మెట్ట ప్రాంతం

గెట్టు : పొలం హద్దు

కౌల్దార్ : భూమిని కౌలుకు తీసకునేవాడు

కమతం : భూమి విస్తీర్ణం

ఇలాకా : ప్రాంతం

ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి

బాలోతా ఇనాం : భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి

సర్ఫేఖాస్ : నిజాం నవాబు సొంత భూమి

సీలింగ్ : భూ గరిష్ఠ పరిమితి

సర్వే నంబర్ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది

నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం

కబ్జాదార్ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి

ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.

ఫీల్డ్ మెజర్మెంట్ (ఎఫ్ఎంబీ) బుక్ : దీన్నే ఎఫ్ఎంబీ టీపన్ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.

బందోబస్తు : వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.

బీ మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్ను బీ మెమో అంటారు.

పోరంబోకు : భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.

ఫైసల్ పట్టీ : బదిలీ రిజిస్టర్

చౌఫస్లా : ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.

డైగ్లాట్ : తెలుగు, ఇంగ్లిఫ్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్.

విరాసత్/ఫౌతి : భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.

కాస్తు : సాగు చేయడం

మింజుములే : మొత్తం భూమి.

మార్ట్గేజ్ : రుణం కోసం భూమిని కుదవపెట్టడం.

మోకా : క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్ఇన్స్పెక్షన్).

పట్టాదారు పాస్ పుస్తకం : రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.

టైటిల్ డీడ్ : భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.

ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) : భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్.

ఆర్ఎస్సార్ : రీ సెటిల్మెంట్ రిజిస్టర్ లేదా శాశ్వత ఏ రిజిస్టర్.

పర్మినెంట్ రిజిస్టర్ : సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్. సేత్వార్ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.

సేత్వార్ : రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.

సాదాబైనామా : భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.

దస్తావేజు : భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇత
రత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

ఎకరం : భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.

అబి : వానకాలం పంట

ఆబాది : గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు

అసైన్మెంట్ : ప్రత్యేకంగాకేటాయంచిన భూమి

శిఖం : చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం

బేవార్స్ : హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్ భూమి అంటారు.

దో ఫసల్ : రెండు పంటలు పండే భూమి

ఫసలీ : జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

నాలా : వ్యవసాయేతర భూమి

ఇస్తిఫా భూమి : పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి

ఇనాం దస్తర్దాన్ : పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి

ఖాస్రాపహానీ : ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

గైరాన్ : సామాజిక పోరంబోకు

యేక్రార్నామా : ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్ తీసుకునే గ్రామాల ఒప్పందం..

Uncategorized

ప్రశ్న : ఆరోగ్య బీమా అంటే ఏమిటి?

సమాధానం:

‘ఆరోగ్య బీమా’ అనే పదం, మీ వైద్య ఖర్చులకు ఆచ్ఛాదన పలిపించే ఒక రకం బీమాకు వర్తిస్తుంది. ఒక ఆరోగ్య బీమా పాలసి బీమా కంపెనీ మరియు ఒక స్వతంత్ర వ్యక్తి/బృందం మధ్య ఒడంబడిక, ఇందులో బీమా కంపెనీ పలసీలో నిర్దిష్టంగా తెలుపబడిన నియమాలు మరియు షరతులకు లోబడి ఒక నిశ్చిత మైన ప్రీమెయమ్ వద్ద నిర్దిష్టమైన ఆరోగ్య బీమా ఆచ్ఛాదనను అందజేయడానికి అంగీకరిస్తారు.

ప్రశ్న : లభిస్తున్న ఆరోగ్య బీమా రకాలేమిటి?

సమాధానం:

ఇండియాలోని ఆరోగ్య బీమా పాలసీలు సాధారణంగా ఆసుపత్రిలో చేర్చబడినందు వల్ల భరించిన ఖర్చులకు ఆచ్ఛాదన కల్పిస్తాయి, అయితే ప్రస్తుతం పలు రకాల పథకాలు అభ్యమవుతున్నాయి, ఇవి బీమా చేయబడుతున్న వారి అవసరం మరియు అభిమతం అధారంగా ఒక శ్రేణి ఆరోగ్య బీమా అందిస్తాయి. ఆరోగ్య బీమా చేసేవారు సాధారణంగా ఆసుపత్రికి నేరుగా డబ్బు చెల్లించే పద్ధతి (నగదు రహిత సౌకర్యం) లేదా జబ్బులు మరియు గాయాలతో సహ సంబంధంగా కల ఖర్చులను తిరిగి చెల్లిచే పద్ధతి లేదా ఒక జబ్బు చేసిన మీదట ఒక స్థిరమైన మొత్తాన్ని అందజేసే పద్ధతిని అందజేస్తారు. ఆరోగ్య ప్రణాళిక ద్వారా ఆచ్ఛాదన కల్పించబడే ఆరోగ్య సంరక్షణ రకం మరియు మొత్తం ముందుగానే నిర్దిష్టంగా తెలియ పరచడం జరుగుతుంది.

ప్రశ్న: ఆరోగ్య బీమా ఎందుకని ముఖ్యమైనది?

సమాధానం:

మన అవసరాలను బట్టి మనందరం మనం మనకొరకు మరియు మన కుటుంబ సభ్యులందరి కొరకు ఆరోగ్య బీమా తప్పకుండా కొనుగోలు చేయాలి. ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడ6 ద్వారా ఆకస్మాత్తుగా, అనుకోని విధంగా ఆసుపత్రిలో చేరితే దాని ఖర్చుల నుండి (లేదా క్రిటికల్ ఇల్ నెస్ లా0టి అచ్ఛాదన కల్పించబడే ఇతర ఆరోగ్య సంబంధిత సంఘటనలు) మనల్ని పరిరక్షిస్తుంది, లేక పోతే ఇంట్లో దాచుకున్న డబ్బును చిల్లి పడుతుంది లేదా అప్పుల బారిన పడవలసివస్తుంది. పలు రకాల ఆరోగ్య సమస్యల హెచ్చరికలు లేకుండా వైద్య సంబంధిత అత్యవసర పరిస్థితి మనలో ఎవరినైనా దెబ్బతీయవచ్చును. సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి, కొత్త ప్రక్రియలు మరియు మరింత ప్రభావం కలిగిన మందులు, వీటన్నిటి ఖరీదు పెరగడంతో ఆరోగ్య సంరక్షణ కూడా రోజు రోజుకి మితిమీరి ఆర్ధిక పరంగా భారమయి పోతున్నది. ఈ అధిక ఖర్చుతో కూడిన చికిత్స్ చాలా మంది మనుషులకు భరించలేనిది, అయితే, ఆరోగ్య బీమా అనే భద్రతను కల్పించుకోవడం చాలా మందికి వీలయ్యే పని.

ప్రశ్న : ఏఏ రకాల ఆరోగ్య బీమా ప్రణాళికలు లభ్యమవుతున్నాయి?

సమాధానం:

ఒక సూక్ష్మ – బీమా పాలసీ క్రింద రూ. 5000 బీమా చేయబడిన మొత్తంలోనే ఆరోగ్య బీమా పాలసీలు లభ్యమవుతున్నాయి, అక్కడి నుండి రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి కూడా కొన్ని నిశ్చితమైన క్రిటికల్ ఇల్ నెస్ ప్లానుల క్రింద లభ్యమవుతున్నాయి. బీమా చేసే చాలా మంది రూపాయలు 1 లక్షల మధ్య మొత్తానికి పాలసీలుల్ జారీచేస్తారు. బీమా చేసే వారి చెల్లించవలసిన గది అద్దెలు మరియు ఇతర ఖర్చులు, ఎంచుకున్న బీమా చేయబడే మొత్తానికి లింకు చేయడం ఎక్కువై పోతున్నది. కాబట్టి, చిన్న వయస్సులోనే తగినంత మొత్తానికి అచ్ఛాదన తీసుకోమని సలహా ఇవ్వబడుతున్నది, ఎందుకనగా, ప్రత్యేకించి ఒక దావా చేసిన తరువాత బీమా చేసే మొత్తాన్ని పెంచండం అ0త సులభం కాదు. ఇంకా, ధారణ బీమా కంపెనీలు చాలా మటుకు ఒక సంవత్సరం వ్య్వధికి ఆరోగ్య బీమా పాలసీలను అందజూపుతాయి, అయితే రెండు, మూడు, నాలుగు మరియు ఐదు సంవత్సరాల వ్యవధికి కూడా జారీచేయ పాలసీలున్నాయి. జీవిత బీమా కంపెనీలు దీర్ఘ కాల వ్యవధికి జారీ చేయబడే ప్లానులను కలిగి యున్నాయి.

ఆసుపత్రిలో చేరిన దానికి ఇచ్చే పాలసీ, ఇది పాలసీ వ్యవధిలో ఆసుపత్రిలో చేర్చిన తరువాత చికిత్సకు వాస్తవంగా అయ్యే ఖర్చులను పాక్షికంగా లేదా పూర్తిగా అచ్ఛాదన కల్పిస్తాయి. ఇదొక విస్చతమైన అచ్ఛాదన రూపం, పలు రకాల ఆసుపత్రి ఖర్చులను వర్తిస్తుంది. దీనిలో కొంత నిర్దిష్ట సమయానికి ఆసుపత్రిలో చేరక ముందు మరియు చేరిన తరువాత ఖర్చులకు వర్తిస్తుంది. అలాంటి లాపసీలు ఒక వ్యక్తికి బీమా చేసే మొత్తంపై లేదా కుటుంబ ఫ్లోటర్ పై అధారపడి లచ్యమవుతాయి, ఫ్లోటర్ లో బీమా చేయబడిన మొత్తం కుటుంబ సభ్యుల మధ్య పంచుకోవడం జరుగుతుంది.

హాస్పిటల్ డెయిలీ క్యాష్ భెనిఫిట్ పాలసీ అనే మరోక పథకం ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోజుకు స్థిరమైన మొత్తంలో బీమా మొత్తం చెల్లిస్తుంది. ఐసియు లో చేర్చబడితే లేదా నిర్దిష్టమైన జబ్బులకు లేదా గాయాలకు ఎక్కువ మొత్తంలో రోజు వారీ ప్రయోజనం అందించే ఆచ్ఛాదన కూడా ఉంటుంది.

క్రిటిల్ ఇల్ నెస్ భెనిఫిట్ పాలసీ, ఒక నిర్దిష్టమైన జబ్బు ఉందని రోగ నిర్ధారణ చేయబడితే లేదా ఒక నిర్దిష్టమైన ప్రక్రియను చేయించుకుంటుంటే, బీమా చేయబడిన వారికి ఒక స్థిరమైన ఏక మొత్తం డబ్బు అందజేయడుతుంది. ఒక చాల తీవ్రమైన జబ్బు కారణంగా పలు ప్రత్యక్ష లేదా పరోక్ష ఆర్ధిక పర్యవసానాలను వీలైనంత వరకూ తగ్గి0చడంలో ఈ మొత్తం సహాయపడుతుంది. సధారణంగా, ఈ మొత్తం ఒకసారి చెల్లింప బడితే, ప్లాను అమలు కావడం పూర్తవుతుంది.

ఒక నిర్దిష్టమైన శస్త్ర చికిత్స్ చేయించుకుంటే ఏక మొత్తంలో చెల్లించడాన్ని అందజూపే ఇతర రకాల పథకాలున్నాయి. (సర్జికల్ క్యాష్ బెనిఫిట్) మరియు వయోవృద్ధుల అవసరాలను నిర్దిష్టమైన రీతిలో లక్ష్యంగా చేసుకుని వారి అవసరాలను నెరవేర్చే పథకాలు కూడా ఉన్నాయి.

ప్రశ్న: నగదు రహిత ప్రయోజనం అంటే ఏమిటి?

సమాధానం:

దేశంలోని ఆసుపత్రుల నెట్ వర్క్తో బీమా కంపెనీలు ఒక ఒప్పంద ఏర్పాటును కలిగి యుంటాయి. నగదు రహిత బీమా పాలసీ క్రింద, పాలసీ దారుడు కనుక నెట్ వెర్క్ ఆసుపత్రులు దేనిలోనైనా చికిత్స చేయించుకుంటే, అప్పుడు బీమా చేయించుకున్న వ్యక్తి ఆసుపత్రి బిల్లులు చెల్లించవలసిన పని లేదు.బీమా కంపెనీ తనథర్డ్ పార్టి ఎడ్మిన్ స్ట్రేటర్ (టిపిఎ) ద్వారా సరాసరి ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. పాలసీ ద్వారా సరాసరి ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. పాలసీ ద్వారా నిర్ధారించబడిన పరిమితులు లేదా ఉప పరిమితులను మించిన ఖర్చులు ఆసుపత్రికి బీమాచేయబడిన వ్యక్తి నేరుగా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, నెట్ వర్క్ లో లేని ఒక ఆసుపత్రిలో మీరు కనుక చికిత్స చేయించుకుంటే, నగదు రహిత సౌకర్యం లభ్యం కాదు.

ప్రశ్న : నేను కనుక ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే నాకు లభించే పన్ను సంబందిత ప్రయోజనా లేమిటి?సమాధానం:

ఒక జతచేయబడిన ప్రోత్సాహకంగా ఆకర్షణీయమైన పన్ను సంబందిత ప్రయోజనాలతో ఆరోగ్య బీమా లభిస్తుంది.

ఆదాయపు పన్ను చట్టంలో ఒక ప్రత్యేక విభాగం ఉన్నది, దీని ప్రకారం, ఆరోగ్య బీమాకు పన్ను ప్రయోజనాలను అందజేస్తుంది.

ఇదే సక్షన్ 80 డి మరియు జీవిత బీమాకు వర్తించే సక్షన్ 80 సి లాగా కాదు, సక్షన్ 80 సి క్రింద ఇతర రకాల పెట్టుబడులు/ఖర్చులు కూడా తగ్గింపుకు అర్హత పొందుతాయి. ప్రస్తుతం, నగదు కాకుండా మరే విధంగానైనా డబ్బు చెల్లించి ఆరోగ్య బీమాను కొనుగోలు చేసిన వారు, తమకు స్వయంగా, భార్య లేదా భర్తకి మరియు తనపై అధారపడిన పిల్లల కొరకు చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియమ్ ద్వారా తమ పన్ను చెల్లించవలసిన ఆదాయంలో రూ.15000 వార్షిక తగ్గింపును లభ్యం చేసుకోవచ్చును. వయోవృద్ధులకు ఈ తగ్గింపు అధికంగా ఉంటుంది. ఇది ఉఊ.200,000.ఇ0కా, ఆర్ధిక సంవత్సరం 2008 – 09 మొదలుకుని, తల్లిదండ్రుల తరపున చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియమ్ కు అదనంగా రూ. 15,000 తగ్గింపు లభ్యం అవుతుంది, ఇది మరలా తల్లిదండ్రులు కనుక వయోవృద్ధులైతే ఈ మొత్తం రూ.20,000.

ప్రశ్న : ఆరోగ్య బీమా ప్రీమియమ్ ను ప్రభావితం చేసే అంశాలేమిటి?

సమాధానం:

ప్రీమియమ్ ని నిర్ధారించే ప్రధాన అంశం వయస్సు. మీకెంత ఎక్కువ వయస్సు ఉంటే మీ ప్రీమియమ్ అంత అధికంగా ఉంటుంది, ఎందుకంటే మీరు జబ్బు బారిన పడే అవకాశం ఎక్కువ కాబట్టి. ప్రీమియమ్ ని నిర్ధారించే మరోక ప్రధాన అంశం, మీ గత వైద్య చరిత్ర. ముందటి వైద్య చరిత్ర ఏఇ లేకపోతే, ప్రీమియమ్ ని నిర్ధారించే ప్రధాన అంశం దానంతట అదే తగ్గుపోతుంది. ప్రీమియమ్ ఖర్చుని నిర్ధారించే మరో ప్రధాన అంశం, దావా రహిత సంవత్సరాలు, ఎందుకంటే దాని ద్వారా కొంత రాయితీ వల్ల మీరు ప్రయోజనం పొందుతారు కాబట్టి. ఇది దానంతట అదే మీ ప్రీమియమ్ తగ్గిపోవడానికి సహాయ పడుతుంది.

ప్రశ్న : ఆరోగ్య బీమా పాలసీ వేటికి అచ్ఛాదన కల్పించదు?

సమాధానం:

ప్రకటన పత్రిక/పాలసీని పూర్తిగా చదివి, దాని క్రింద ఆచ్ఛాదన కల్పించబడనిదేమిటో మీరు అర్థం చేసుకోవాలి. సాధారణంగా ముందే ఉన్న వ్యాధులు (ముందుగానే ఉన్న వ్యాధి అనేదానిని ఎలా నిర్వచించారో అర్థం చేసుకోవడానికి పాలసీని చదవాలి) ఆరోగ్య బీమా పాలసీ నుండి మినహాయించడం జరుగుతుంది. తదుపరి, ఆచ్ఛాదన యొక్క మొదటి సంవత్సరం నుండి కొన్ని వ్యాధులను పాలసీ సాధారణంగా మినహాయిస్తుంది మరియు వేచి ఉండవలసిన వ్యవధి కూడా విధించబడుతుంది. కళ్ళద్దాలు, కాంటాక్ట్ లెన్సులు మరియు వినికిడి సాధనాలు లాంటి ప్రమాణికమైన మినహాయింపులు ఉంటాయి, అలాగే దంత చికిత్స్ / శస్త్ర చికిత్స్ (ఆసుపత్రిలో చేర్చవలసిన అవసరం రాకపోతే తప్ప) ఆచ్ఛాదన కల్పించబడదు, మూర్ఛలు, సాధారణ ఆసక్తత, పుట్టుకతో వచ్చిన బాహ్య లోపాలు, వి.డి., కావాలని స్వయంగా పరుచుకోవడం, మత్తును కలిగించే ఔషదాలు/మద్యాన్ని ఉపయోగించడం, ఎయిడ్స్ , రోగినిర్ధారణ ఖర్చులు, ఆసుపత్రిలో చేరవసిన అవసరం ఉన్న వ్యాధికి సంబందం లేని ఎక్స్ – రే, లేదా లేబరేటరీ పరిక్షలు, సెజేరియన్ విభాగంతొ సహా గర్భధారణ లేదా బిడ్డ జననంకు సంబందించిన చికిత్స , నేచురోపతి చికిత్స

ప్రశ్న: పాలసీ క్రింద వేచి ఉండవలసిన వ్యవధి ఏదైనా ఉందా?

సమాధానం:

అవును. మీరొక కొత్త పాలసీ తీసుకునప్పుడు ,సాధారనంగా ,పాలసీ ప్రారంభ తేదీ నుండి 30 రోజులు వేచి ఉండవలసిన వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధి సమయంలో ఏదైనా ఆసుపత్రిలో చేర్చబడిన ఛార్జీలను బీమా కంపెనీ చెల్లించదు. అయితే, దుర్ఘటన కారణంగా అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చవలసి వస్తే ఇది వర్తించదు. రెన్యువల్ చేయబడ్డ తదుపరి పాలసీలకు ఈ వేచియుండే వ్యవధి వర్తించదు.

ప్రశ్న : ఆరోగ్య బీమా పాలసీ క్రింద ముందుగానే ఉన్నస్థితి అంటే ఏమిటి?సమాధానం:

మీరు ఆరోగ్య బీమా పాలసీని తీసుకోకముందే మీకున్నటువంటి స్థితి/వ్యాధి, మరియు ఇది విశిష్టమైనది, ఎందుకంటే మొదటి పాలసీకి 48 నెలల ముందు అలా ముందుగానే ఉన్న పరిస్థితులకు బీమా కంపెనీలు ఆచ్ఛాదన కల్పించవు. దీనర్థం, బీమా ఆచ్ఛాదన కొనసాగుతున్న 48 నెల పూర్తయిన తరువాత ముందుగానే స్థితికి చెల్లింపు చేయడానికి పరిగణించవచ్చు అని.

ప్రశ్న : ముగింపు తేదీ ముందుగా నా పాలసీని పునరుద్ధరించక పోతే పునరుద్ధరించడానికి నేను నిరాకరించబడతానా?

సమాధానం:

ముగింపు తేదీ కి 15 రోజుల లోపల (దీనిని ఉదార వ్యవధి (గ్రేస్ పీరియడ్) అంటారు) మీరు కనుక ప్రీమియమ్ చెల్లించినట్లయితే పాలసీ పునరుద్ధరింప బడుతుంది. అయితే, బీమా కంపెనీ చేత ప్రీమియమ్ అందుకొని సమయానికి ఆచ్ఛాదన లభించదు. ఉధార వ్యవధి లోపల ప్రీమియమ్ కనుక చెల్లించక పోతే పాలసే రద్ధయిపోతుంది.

ప్రశ్న : పునరుద్ధరణ ప్రయోజనాన్ని పోగొట్టుకోకుండా ఒక బీమా కంపెనీ నుండి మరొక దానికి నేను బదిలీ చేసుకోవచ్చునా?

సమాధానం:

అవును. బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికార వర్గం (ఐ ఆర్ డి ఎ) వారు దీనిని 1 అక్టోబర్ 2011 నుండి అమలు చేయాలని ప్రకటన పత్రిటను జారీచేసారు, దీని ప్రకారం ఒక బీమా కంపెనీ నుండి మరొక దానికి బదిలీచేసుకోవడాన్ని, ఇంతకు మునుపటి పాలసీ ద్వారా లభించిన ముందుగానే ఉన్న షరతులతో బీమా చేయబడిన వ్యక్తి పునరుద్ధరణ క్రెడిట్లను నష్టపోకుందా అనుమతించమని నిర్దేశించడం జరిగింది. అయితే, ఇంతకు మునుపటి పాలసే క్రింద బీమా చేయబడిన మొత్తానికి (బోనస్ తో కలిపి ) ఈ క్రెడిట్ పరిమితం చేయబడుతుంది. వివరాల కొరకు, బీమా కంపెనీతో మీరు సంప్రదించవచ్చును.

ప్రశ్న : ఒక దావా సమర్పించిన తరువాత పాలసీ ఆచ్ఛాదనకు ఏమి జరుగుతుంది?సమాధానం:

ఒక క్లెయిమ్ సమర్పించిన తరువాత మరియు అది పరిష్కరించ బడిన తరువాత, పరిష్కారం సందర్భంగా చెల్లించిన మొత్తం పాలసీ ఆచ్ఛాదన నుండి తగ్గించడం జరుగుతుంది. ఉదాహరణకు, జనవరిలో సంవత్సరానికి రూ. 2 లక్షలతో ఆచ్ఛాదనతో ఒక పాలసీని మీరు ప్రారంభిచారనుకోండి. ఎప్రిల్ లో, 2 లక్షలకు దావా సమర్పంచారు. మే నుండి డిశంబరు వరకుక్ లభించే ఆచ్ఛాదన, మిగిలిన రూ.3 లక్షల రూపాయలు.

ప్రశ్న : “ఏదైన ఒక అస్వస్థత” అంటే ఏమిటి?

సమాధానం:

“ఏదైన ఒక అస్వస్థత” అంటే అర్థం, అస్వస్థత కొనసాగే వ్యవధి అని, దీనిలో పాలసీలో నిర్దిష్టంగా తెలియజేసినట్లుగా నిశ్చితమైన రోజులలో తిరగబెట్టడం కూడా కూడి యున్నది. సాధారణంగా ఇది 45 రోజులు ఉంటుంది.

ప్రశ్న : ఒక సంవత్సరంలో గరిష్టంగా అనుమతించబడే దావాలు ఎన్ని?

సమాధానం:

పాలసీ దేన్లోనైనా నిర్దిష్టంగా పరిమితి విధించక పోతే, తప్ప పాలసీ వ్యవధిలో ఎన్ని దావాలనైనా చేసుకోవచ్చును. అయితే, పాలసీ క్రింద బీమా చేయబడిన మొత్తం, గరిష్టంగా పరిమితి

ప్రశ్న: “ఆరోగ్య తనిఖీ” సౌకర్యం అంటే ఏమిటి?

సమాధానం:

కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు కొన్ని సంవత్సరాలలో ఒకసారి సాధారణ ఆరోగ్య తనిఖీకి నిర్దిష్టమైన ఖర్చులను చెల్లిస్తాయి. సాధారణంగా ఇది నాలుగు సంవత్సరాలకు ఒకసారి లభిస్తుంది.

ప్రశ్న: కుటుంబ ఫ్లోటర్ పాలసీ అంటే అర్థం ఏమిటి?

సమాధానం:

కుటుంబ ఫ్లోటర్ పాలసీ అనేది మీ పూర్తి కుటుంబపు ఆసుపత్రి ఖర్చులను చెల్లించే ఒక సింగిల్ పాలసీ. పాలసీకి ఒకే బీమా చేయబడిన మొత్తం ఉంటుంది, దీనిని బీమా చేయబడిన వ్యక్తులు ఎవరైనా / అందరూ నిష్పత్తి దేనిలోనైనా లేదా మొత్తం ఉపయోగించుకోవచ్చును, అయితే బీమా చేయబడిన పాలసీ మొత్తం యొక్క మొత్తం మీది పరిమితి వరకు ఇలా చేయవచ్చును. చాలా తరచుగా కుటుంబ ఫ్లోటర్ ప్లానులు విడిగా ఒక్కో వ్యక్తికి పాలసీలు తీసుకోవడం కన్నా మెరుగైనవి. అకస్మాత్తుగా జబ్బు చేయడం, శస్త్ర చికిత్సలు మరియు దుర్ఘటనల సందర్భాలలో వైద్య ఖర్చులన్నిటి పట్ల కుటుంబ ఫ్లోటర్ పాలసీ శ్రద్ధ వహిస్తాయి.