Stock Market

స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు నష్టపోయిన డబ్బు ఏమవుతుంది?

స్టాక్ మార్కెట్ ‘జీరో సం గేం’ గా పిలవబడుతుంది.

మార్కెట్లు మూసివున్న డబ్బా వంటివి అయితే అలా అనుకోవచ్చేమో, కానీ అలా కాదు. ఫ్రెష్ క్యాష్ మార్కెట్లలోకి వస్తూనే ఉంటుంది.

అంటే ఒకరికి డబ్బులు వస్తే వేరే వారికి అవి పోవాలి. లేకపోతే అవి కేవలం కాగితం మీద కనబడే లాభమే తప్ప మన జేబులోకి వచ్చినది కాదు. మనం షేర్లు కొన్నప్పుడు వేరొకరు (లేకపోతే కంపెనీ వారు) అమ్మితేనే కొనగలం. ఆ షేర్ల సంఖ్య ఫిక్సెడ్ గా ఉంటుంది. కొత్త షేర్లు ఇష్యూ చెయ్యాలంటే సెబీ వారి అనుమతి కావాలి.

మనం ₹10 లో కొన్న షేరు ₹20 లో అమ్మితే వేరే వారెవరో అది కొన్నారనే అర్ధం. కొన్ని కంపెనీల షేర్లు కొనడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడవి పతనం అయ్యి లోవర్ సీలింగు వేసుకుంటూ సున్నా కి దగ్గరగా వెళ్ళిపోతాయి. మనం ₹20 లొ కొన్న షేరు ₹10 లో అమ్ముకుంటే మనకి పోయిన పది వేరెప్పుడో ఎవరో ₹10 లొ కొని ₹20 లో అమ్మేరు గా, వారి లాభం మన నష్టం రెండూ కంపెనీకి చెందవు (ఆ కంపెనీ ఏ మన షేర్లు కొంటే తప్ప); రెండు లావాదేవీలు బ్యాలెన్స్ అయిపోయాయి రిపోర్టులో.

కంపెనీ కి కేవలం ఈ షేర్ల రూపం లో కనబడే విలువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గా చూపించుకొని అదనపు నిధులు పెట్టుబడి సంస్థల నుంచీ రాబెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆ విలువని పెరుగుతూ ఉండేలాగ వారు చర్యలు తీసుకుంటారు. వారి కంపెనీ అమ్మాలి అనుకున్నప్పుడు ఈ క్యాపిటలయిజేషన్ ఆధారంగా అమ్ముతారు కాబట్టీ ఆప్పుడు వారి జేబులోకి లాభం వచ్చి చేరుతుంది. అంతవరకూ అది కూడా కాగితానికే పరిమితం.

అందుకే దీర్ఘ కాలిక మదుపరులెవరయినా చూసేది లాభాలలో ఉన్న కంపెనీలలో మదుపు పెట్టడానికి. ప్రతీ త్రైమాసిక ఫలితాల తరువాత ఆ కంపెనీ అర్జించిన లాభాలను మొత్తం ఇష్యూ చెయ్యబడిన షేర్ల తో హెచ్చించి డివిడెండు రూపం లో ప్రతీ షేరు హోల్డరుకీ పంచుతారు.

మిగితా దైనిక స్టాక్ మార్కెట్ లావాదేవీ ఆధారిత లాభనష్టాలన్నీ మదుపరులు, లేక ఆ షేర్లు కొనుగోలు చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండులు , అవి తనఖా పెట్టబడిన బ్యాంకులకే చెందుతాయి. ఎస్టీటీ, సర్చార్జి రూపం లో గవర్నమెంటు ప్రతీ లావాదేవీ మీద సుంకం విధిస్తుంది కాబట్టీ ఎప్పటికయినా నిజంగా లాభం అనేది కేవలం మన ప్రభుత్వం మాత్రమె పొందుతుందని చెప్పాలి .

కొన్ని ఉదాహరణలు:

మీరు ఒకానొక ప్రదేశంలో రాబోవు కాలంలో అభివృద్ధి బాగా జరిగి, భూమి విలువ పెరుగుతుందని తెలుసుకుని, కొంత భూమిని కొన్నారనుకోండి. అభివృద్ధి జరగకో, ఏదో వివాదంలో చిక్కుకునో, ఆ భూమి విలువ పడిపోయిందనుకోండి. అప్పుడు నష్టపోయిన డబ్బు ఎక్కడకు పోయినట్టు?

మీకు అనుకోకుండా కొంత డబ్బు చేతికొచ్చి, దాంతో బంగారం కొన్నారనుకోండి. కొంత కాలానికి స్టాక్ మార్కెట్లలో చాంచల్యం తగ్గటం వల్లనో, అంతర్జాతీయ పరిణామాల వల్లనో బంగారం ధర పడిపోయిందనుకోండి. మీ కొనుగోలు నష్టపూరితమైనదా?

ఓ సంస్థ IPOలో షేర్లు కొన్న మదుపరి వాటిని అలాగే అట్టిపెట్టుకుని బయ్ బ్యాక్[1]లో తిరిగి ఎక్కువ ధరకు కంపెనీకి అమ్మితే నష్టపోయింది ఎవరు?

ఓ సంస్థ షేర్లు ఒకరు 10 రూపాయలకు కొని, 9 రూపాయలకు అమ్మేసారు. అయితే, మధ్యలో డివిడెండ్ 2 రూపాయలు వచ్చుంటే ఇది నష్టపూరిత లావాదేవి కాదు.

కొందరు మదుపర్లు తమ పోర్ట్ ఫోలియో రక్షణకు హెడ్జింగ్ ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో ఓ సంస్థకు చెందిన ఒక సాధనంలో ఎక్కువ లాభం కొరకు అదే సంస్థకు చెందిన మరో సాధనంలో కాస్త నష్టం నమోదు చేసుకుంటారు. అప్పుడు కూడా ఇది Zero Sum Game అవ్వదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *